తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే.. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఫిబ్రవరి 21న సాయంత్రం వేళలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఇక సినిమా ప్రీ రిలీజ్ రోజునే భీమ్లా నాయక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. అన్నివిధాలా భీమ్లా నాయక్ విడుదలకు రెడీ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఈ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ కూడా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇంతలోనే అనుకోకుండా ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చినట్లు తెలుస్తుంది.
Our deepest condolences to the family & friends of AP Minister Mekapati Goutham Reddy garu on his sudden demise. As a mark of respect, the pre-release event of #BheemlaNayak won’t be happening today!
— Sithara Entertainments (@SitharaEnts) February 21, 2022
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడినట్లు సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది. ఎందుకు అనే ప్రశ్నకు కారణం కూడా లేకపోలేదు. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం కారణంగా పవన్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక భీమ్లా నాయక్ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తుండగా.. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు. మరి భీమ్లా నాయక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.