తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ ‘గంగోత్రి’ చిత్రంతో హీరోగా ఎంట్రీ తన డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో ఐకాన్ స్టార్ కోట్ల మంది అభిమానం సంపాదించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ఫ తో తన రేంజ్ మరింతగా పెంచుకున్నాడు. ఇప్పటికీ కొన్ని చోట్ల పుష్ప మానియా తగ్గనే లేదు. ఈ మూవీలో డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్ జనాలు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.
అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీకి ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ లభించింది. ఇందులో తగ్గేదే లే అనే డైలాగ్ తెగ పాపులర్ అయ్యింది. ఇక పుష్ప మూవీకి ఈ ఏడాది అవార్డుల పంట పండింది. ఇటీవల ఈ మూవీకి సైమా, ఫిలిం ఫేర్ అవార్డులు అత్యధికంగా వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అల్లు అర్జున్ కి దక్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఇండియా హీరో బన్ని కావడం మరో విశేషం.
న్యూ ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరయ్యారు. స్మృతీ ఇరానీ చేతుల మీదుగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభం అయి ఇరవై ఏళ్లు అవుతుందని.. ఇప్పటి వరకు సౌత్ సినీ పరిశ్రమ నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నానని. కానీ ఫస్ట్ టైమ్ తాను నార్త్ ఇండియా నుంచి అవార్డు అందుకోవడం ఎంతో సంతోషం అనిపిస్తుందని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకం అని అన్నారు.
ఇప్పుడు సీనీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ నడుస్తుంది.. నార్త్, సౌత్ అనే బేధాలు లేకుండా అందరం సినీ కళామతల్లి బిడ్డలమే అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా గొప్పతనం ఎప్పటికీ తగ్గేదే లే అంటూ తన పుష్ప డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టున్నారు బన్నీ.
ఇది చదవండి: అల్లు అర్జున్ కి కంగ్రాట్స్ చెప్పిన డేవిడ్ వార్నర్.. పోస్ట్ వైరల్!