కడుపు నొప్పిని తట్టుకోలేకపోతున్నా.. చివరిగా నిన్ను ఒక్కసారి చూడాలని కాల్ చేశాను అంటూ భార్య భర్తకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం అప్పన్నపాలెం. ఇదే గ్రామంలో రమణ, హైమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది.
అయితే పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులు భీమిలి మండలం భీమిలీ క్రాస్ రోడ్డు ప్రాంతంలో కాపురం పెట్టారు. భర్త దివీస్ లో ఉద్యోగం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇక ఏడాది క్రితం ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించాడు. ఈ క్రమంలోనే హైమాకు చేసిన సర్జరీ వికటించడంతో అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపథ్యంలోనే హైమా కడుపు నొప్పితో కూడా బాధపడేది. దీంతో భర్త అనేకసార్లు ఆస్పత్రుల చుట్టు తిరిగి చూపించాడు. అయితే శుక్రవారం భర్త రమణ బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మాత్రం బాబు, హైమా ఇద్దరే ఉన్నారు.
ఇక అదే రోజు మధ్యాహ్న సమయంలో హైమాకు కడుపు నొప్పి వచ్చింది. దీంతో హైమా ఆ నొప్పిని తట్టుకోలేకపోయింది. ఇక నా వల్ల కాదనుకుని.. హైమా వెంటనే భర్తకు వాట్సాప్ కాల్ చేసి.. నాకు కడుపు నొప్పి తీవ్రంగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, చివరిసారిగా నిన్ను చూసేందుకు కాల్ చేశానని చెప్పి హైమా కాల్ కట్ చేసింది. దీంతో ఖంగారుపడ్డ భర్త హుటాహుటిన ఇంటికొచ్చేలోపే భార్య ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు వదిలింది. భార్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో భర్త రమణ కన్నీటి సంద్రంలో మునిగిపోయాడు. కొడుకును నన్ను వదిలేసి పోయావా అంటూ ఏడ్చాడు. ఇక అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.