వికారాబాద్ జిల్లాలో సెల్పీ వీడియో కలకలం రేపుతోంది. తన తమ్ముడిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటిని భరించలేకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఓ వ్యక్తి సెల్పీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వికారాబాద్ జిల్లాలోని ఓ ప్రాంతంలో అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. వీళ్లిద్దరికీ వివాహాలు జరిగాయి. అయితే గత కొంతకాలం నుంచి తమ్ముడిపై అతని భార్య పుట్టింటి వారు 498A కేసు పెట్టి వేధిస్తున్నారు. దీంతో వారి వేధింపులు తట్టుకోలేని అన్న సెల్ఫీ వీడియోలో తన బాధను చెప్పుకుని చివరికి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అసలు ఆ సెల్ఫీలో ఏముందంటే? నా తమ్ముడిపై అతని అత్తింటివారు 498A కేసు పెట్టి వేధిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, పోలీసుల అండదండలతో మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. ఎన్నిసార్లు వేడుకున్నా మా మాట అస్సలు వినడం లేదు. నీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. డబ్బులు ఇప్పుడు కట్టలేము, ఎవరిని అడిగినా డబ్బులు ఇవ్వడం లేదు. నా పరిస్థితి ఇప్పుడు బాగలేదు. ఇక కారు అమ్మి డబ్బులు ఇస్తామని వేడుకున్నా కూడా వారు వేధింపులకు దిగుతూనే ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు, ఇప్పుడు నా భార్య ప్రెగ్నెంట్. నేను చనిపోతే ఎవరు సమాధానం చెబుతారు.
అరేయ్ హనుమంతు.. నా చావుకి కారణం నువ్వే. నీ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. స్థానిక ఎస్సై ఇకనైన మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా అంటూ అన్న సెల్ఫీ వీడియోలో తన బాధను వివరించి సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సెల్ఫీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.