Crime News: ఉత్తర ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృత్యువాత పడగా మరో 17 మంది గాయపడ్డారు. హపుర జిల్లాలోని యూపీఎస్ఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై హపుర్లోని ఎస్పీ దీపక్ భుకర్ మాట్లాడుతూ.. ‘‘ ఏ పదార్థం కారణంగా ఆ పేలుడు సంభవించిందో ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది. సంఘటనా స్థలం నుంచి మేము ప్లాస్టిక్ పాలెట్స్ స్వాధీనం చేసుకున్నాం. ఈ పాలెట్స్ను బొమ్మ తుపాకుల తయారీలోనూ..
దీపావళి టపాసుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలోనే ఇవన్నీ తయారవుతున్నాయి’’ అని అన్నారు. ప్రమాదానికి సంబంధించిన ఓ సీసీటీవీ ఫుటేజీల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 25 సెకన్ల ఆ వీడియోలో పేలుడు తీవ్రత ఎలా ఉందనేది స్పష్టమవుతోంది. పేలుడు కారణంగా ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ పైకప్పు గాల్లోకి ఎగిరి పడింది. పక్కన ఉన్న మరికొన్ని ఫ్యాక్టరీలు కూడా డ్యామేజ్ అయ్యాయి. మరి, ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Massive blast in Hapur captured on CCTV
Nine labourers died and at least 19 others were injured in a blast at a factory Uttar Pradesh’s Hapur district yesterday pic.twitter.com/T0DYifamZR
— Hindustan Times (@htTweets) June 5, 2022
ఇవి కూడా చదవండి : Amnesia Pub Case: జూబ్లీహిల్స్ పబ్ కేసులో చిక్కిన మొత్తం ఐదుగురు నిందితులు!