వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి పెళ్లై మూడు నెలలు అయింది. భర్త స్థానికంగా ఓ హోటల్ లో పని చేస్తూ కొత్త సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. పెళ్లైన మూడు నెలల నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే జీవించారు. ఇక మంగళవారం భర్త ఎప్పటి లాగే పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇక ఇంటికి వచ్చి చూసే సరికి భార్య భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. దీనిని నుంచి కోలుకోలేని భర్త లబో దిబోమంటు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
అది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లి. ఇదే గ్రామానికి చెందిన బుక్క వెంకటేష్ అనే యువకుడు మూడు నెలల కిందట యాచారం గ్రామానికి చెందిన శివానీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఈ దంపతులు ఇద్దరు దాసర్లపల్లి సమీప ప్రాంతమైన కడ్తాల్ లో కాపురం పెట్టారు. భర్త స్థానిక హోటల్ లో పని చేస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. అలా పెళ్లైన మూడు నెలల పాటు ఈ నవ దంపతులు వైవాహిక జీవితాన్ని గడుపుతూ వచ్చారు. అయితే మంగళవారం రోజు వెంకటేష్ ఎప్పటిలాగే పనికి వెళ్లాడు.
సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో భార్య శివానీ కనిపించలేదు. అటూ ఇటూ అంతా వెతికాడు. ఎక్కడా కూడా తన భార్య ఆచూకి కనిపించలేదు. బంధువులకు ఫోన్ చేసి తెలుసుకున్నాడు. అక్కడ కూడా లేదన్నారు. ఇక చేసేదేం లేక భర్త వెంకటేష్ కడ్తాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన మూడు నెలలకే భార్య కనిపించకుండా పోవడంతో భర్త శోక సంద్రంలో మునిగిపోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.