ఈ మద్య కొంత మంది దొంగలు కొత్త కొత్త ప్లాన్స్ తో ఎదుటివారిని ఈజీగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా కనిపించే ఆడవారిని టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ లకు పాల్పపడుతుంటే.. కొంతమంది కిలాడి లేడీలు మగవారిని మాయమాటలు చెప్పి నిలువు దోపిడి చేస్తున్నారు. మరికొంత మంది కేటుగాళ్ళు రోడ్డుపై వచ్చేవారిని టార్గెట్ చేసుకొని వారిపై దాడి చేసి దోచుకుంటున్నారు. బైక్ పై వెళ్తున్న వాహనదారుడిని ఓ యువకుడు లిఫ్ట్ అడిగి తర్వాత ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాదు ఒంటరిగా ఉన్నవారు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తే ఇలా ఇంజక్షన్ ఇచ్చి చంపుతున్నారని పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ కొనసాగిస్తున్న వేళ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వివాహేతర సంబంధం కారణంగా జరిగి ఉండవొచ్చని అంచనా వేస్తున్నారు. హత్య జరిగిన తర్వాత వార్తలు వైరల్ కావడంతో పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నాలుగు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగించారు.
మృతుడు షేక్ జమాల్ సాహెబ్ కూతురు వద్ద ఆయన భార్య మూడు రోజులుగా ఉంటుంది. తన భార్యను తీసుకు వచ్చే క్రమంలో జమాల్ తన బైక్ పై వెళ్తుండగా ముదిగొండ వద్ద ఇద్దరు లిఫ్ట్ అడిగారు. తాము వస్తున్న బండిలో పెట్రోల్ ఖాళీ అయ్యిందని.. దగ్గరలోని బంక్ లో పెట్రోల్ తీసుకు వచ్చేందుకు లిఫ్ల్ ఇవ్వాల్సిందిగా జమాల్ ని రిక్వెస్ట్ చేశారు. ఓ యువకుడిని తన బైక్ పై ఎక్కించుకొని వెళ్తున్న క్రమంలో అతడు మాస్క్ ధరించి జమాల్ వీపు పై ఇంజక్షన్ ఇచ్చాడు. ఏదో గుచ్చుకున్నట్లు అనిపించిన జమాల్ ఏం చేశావు అనేలోపు ఆ వ్యక్తి పక్కకు దూకాడు. అంతలో మరో వ్యక్తి బైక్ పై వచ్చి తీసుకు వెళ్లినట్లు వార్తలువ వస్తున్నాయి. ఇంజక్షన్ ప్రభావంతో జమాల్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించేలోపు చనిపోయాడు.
జమాల్ బంధువు లాల్ సాహెబ్ ఖమ్మం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఈ వార్త దావానంలా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇంజక్షన్ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు.. ఇది జమాల్ ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? చంపింది ఎవరైనా సీరియల్ కిల్లర్ అయి ఉంటాడా? ఇంతకు ముందు ఇలాంటి హత్యలు జరిగాయా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు జమాల్ హత్య వెనుక కుటుంబ సభ్యుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించగా కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. మొదట హంతకుడు వేరే వ్యక్తిని లిఫ్ట్ అడిగినప్పటికీ జమాల్ వచ్చాక అతని బైక్ ఎక్కి ఈ దురాఘతానికి పాల్పపడ్డాడు. ఈ కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు జమాల్ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లు కూడా పరిశీలించారు. డేటాలో అతడి భార్య ముగ్గురితో పదే పదే టచ్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జమాల్ వివరాలు తెలుసుకున్న దుండగులు అతన్ని టార్గెట్ చేసి హతమార్చారా? అన్న విషయంపై పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. త్వరలో హంతకులు వివరాలు తెలియజేస్తామని అంటున్నారు పోలీసులు.