భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సహజం. అలా జరిగిన గొడవలకు కొందరు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే ఇళ్లు వదిలి వెళ్లిపోవడం చేస్తుంటారు. సరిగ్గా అలాగే అడుగులు వేసిన ఓ భార్య భర్తను వదిలి వెళ్లిపోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పెట్ మండలం కుంట్లూరు. ఇదే ప్రాంతానికి చెందిన తిరుందాస్ ప్రసాద్, పూజా భార్యాభర్తలు.
వీరికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్నినెట్టుకొస్తున్నాడు. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలతో ఈ దంపతులు జీవితాన్నిసంతోషంగా గడుపుతున్నారు. అప్పటి వరకు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా ఆనందంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా కలహాలు మొదలయ్యాయ. దీంతో గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తలు ఉప్పు, నిప్పులా తయారయ్యారు. అయితే ఇటీవల ఈ దంపతుల మధ్య మరోసారి గొడవలు చెలరేగాయి. ఇక విసిగిపోయిన భార్య భర్తతో ఉండడం నా వల్ల కాదనుకుందో ఏమో తెలియదు కానీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
శుక్రవారం నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని, నా కోసం వెతకొద్దు. ఒకవేళ వెతికితే మాత్రం పిల్లలతో సహా నేను కూడా చస్తానని భర్తకు మెసెజ్ చేసి ఇళ్లు వదిలి పిల్లలతో పాటు వెళ్లిపోయింది. ఇక సాయంత్రం అయినా భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజా ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.