దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిత్యం ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. మహిళలు పట్టపగలు కూడా బయటికి ఒంటరిగా రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మద్య దొంగలు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు, నగలు దోచుకోవడమే కాదు.. ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేస్తున్నారు.. ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఒక ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు భర్త ఎదుటే భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ సరూప్ గంజ్ లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. భర్త చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నలుగురు దొంగలు ఇంట్లోకి చొరపడి భర్తపై దాడి చేసి అతని వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నాడు. బంగారం, నగదు కోసం ఇల్లంతా గాలించారు.. కానీ వారికి ఏమీ లభించలేదు. దాంతో మరోసారి భర్తపై దాడి చేసి కట్టేశారు. ఆ తర్వాత నలుగురు కలిసి భర్త ముందే భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. అనుకోకుండా దొంగలు ఇంట్లోకి చొరబడటం.. తనపై అత్యాచారం చేయడంతో మహిళ షాక్ కి గురైంది.
ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించాడు భర్త. అయితే భార్య మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు తెలియజేయాలని వెళ్లి ఆ దుండగులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.. ఒక దుండగుడు మాత్రం పరారీలో ఉన్నాడని.. త్వరలో అతన్ని కూడా పట్టుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆ నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.