ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన మహిళలు తాళికట్టిన భర్తను కాదని వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతున్నారు. ఇలా పచ్చని సంసారాన్ని చేజేతులా కూల్చేసి పరాయి మగాడితో రొమాన్స్ కు తెర తీస్తున్నారు. చివరికి వివాహ వ్యవస్థకే చెరిగిపోని మచ్చ తెస్తున్నారు. అచ్చం ఇలాగే పావులు కదిపిన ఓ ఇల్లాలు కట్టుకున్న మొగుడికి మస్కా కొట్టి ప్రియుడితో బెడ్ రూంలో సరసాలకు దిగింది. ఇక ప్రియుడితో పాటే కలిసి ఉండేందుకు భర్తను ఎర్రిపప్పని చేసి.., చివరికి తాళికట్టిన మొగుడి ప్రాణాలను తీసేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ కథ స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
అది పంజాబ్ లోని లుథియానా జిల్లా మచివారా పరిధిలోని గాడిబెట్ గ్రామం. ఇక్కడే జస్వీర్ సింగ్ (35), మమత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై చాలా కాలమే అవుతుంది. పెళ్లైన కొన్నాళ్ల పాటు భర్త భార్య వద్దే ఉన్నాడు. కొంత కాలానికి ఉద్యోగ నిమిత్తం భర్త దుబాయ్ కి పయనమయ్యాడు. అలా కొన్ని నెలల గడిచాయి. భర్త దూరమవ్వడంతో భార్య ఒంటరిగా ఉండేది. ఈ క్రమంలోనే మగ తోడు కోసం ఎదురు చూసిన మమతకు బంధువైన జోగిందర్ సింగ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయమే రాను రాను ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భర్త లేకపోవడంతో భార్య అతనితో మెల్ల మెల్లగా శారీరకంగా కలుసుకోవడం చేసింది. ఇలా కొన్నాళ్లకి మమత ప్రియుడిని ఏకంగా ఇంటికే రప్పించుకుంటూ తన కోరికలన్నీ తీర్చుకుంది. ఎంతో ఘనంగా వర్ధిల్లుతున్న వీరి చీకటి సంసారం రోజుల నుంచి సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే చాలా ఏళ్లకి భర్త ఇంటికి వస్తున్నానంటూ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో భార్య మమత ఒక్కసారిగా ఖంగుతినింది. భర్త వస్తే తన వ్యవహారాలు సాగవని తనలో తాను కుమిలిపోతూ ఉంది. ఇక దుబాయ్ నుంచి భర్త కూడా రానే వచ్చాడు.
భార్యను చూసి చాలా రోజులు కావడంతో భర్త ఇష్టమొచ్చింది కొనిస్తూ, సినిమాలు, షికారులంటూ తెగ తిరిగారు. అలా భర్త భార్యతో రెండు రోజులు గడిపాడు. చివరికి భార్య అక్రమ సంబంధ వ్యవహారం ఎట్టకేలకు భర్తకు తెలిసింది. దీంతో భార్యను భర్త చితకబాదాడు. భర్త కొట్టడంతో భార్య మమత తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఈ క్రమంలోనే భర్తతో ఉండడం ఇష్టం లేని మమత ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. ప్రియురాలి మాటను కాదనకుండా ప్రియుడి వెంటనే వాలిపోయాడు.
భర్తకు అనుమానం రాకుండా భార్య మమత ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో భార్యను విచారించారు. పోంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు భార్యపై అనుమానం వచ్చింది. ఎట్టకేలకు పోలీసులు స్టైల్ లో విచారించే సరికి.., నా భర్తను నా ప్రియుడి సాయంతో నేనే హత్య చేశానంటూ మమత ఒప్పుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ కథా చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.