సాధారణంగా పాములు పగ పడతాయని, సప్త సముద్రాల అవతల ఉన్న వెంటాడి మరీ కాటేస్తాయని కొందరు అభిప్రాయా పడుతుంటారు. ఇదే విషయంపై ఎన్నో సినిమల్లో కూడా చూపించారు. సినిమాల ప్రభావంతో కూడా పాములు పగపడతాయని కొందరు బలంగా నమ్ముతారు. అయితే ఈ మాటలను శాస్త్రవేత్తలు ఖండిస్తుంటారు. కానీ కొన్ని ఘటనలు చూసినప్పుడు మాత్రం పాములు నిజంగానే పగపడతాయేమో అని అనిపిస్తుంది. తాజాగా ఓ వ్యక్తి పది రోజుల వ్యవధిలో ఐదుసార్లు పాముకాటుకు గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో మన్ ఖేడ గ్రామానికి చెందిన రామ్కుమార్ చాహర్ కుమారుడు రజత్ చాహర్ డిగ్రీ చదువుతున్నాడు. సెప్టెంబర్ 6న రాత్రి ఇంటి బయట నడుస్తుండగా రజత్ ఎడమ కాలు పై పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నాలుగు గంటల పాటు అతడి పరిస్థితి పర్యవేక్షించిన వైద్యులు.. ఎక్కడ పాము కాటు లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. తిరిగి ఇంటికి వచ్చిన రెండు రోజులకి.. అంటే సెప్టెంబర్ 8న కాలకృత్యాలకని రజత్ బయటకి వెళ్లాడు. అక్కడ రజత్ ఎడమ కాలిపై మరోసారి పాము కాటు వేసింది. ఈసారి నాటు వైద్యుడి వద్దకు తీసుకెళ్ళి చికిత్స చేయించారు. ఇదేవిధంగా 11, 13, 14 తేదీల్లో రజత్ను పాము కాటువేసింది. అయితే, ఐదుసార్లూ ఎడమకాలిపైనే కాటువేడయం గమనార్హం.
దీంతో పాము ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కాటేస్తుందో అనే భయంతో కాళ్లకు షూ ధరిస్తున్నాడు. అసలు ఆ పాము తననే ఎందుకు వెంటాడుతోందో, ఒకేచోట కాటేయడం ఏమిటో తెలియక రజత్ తో పాటు అతడి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. రజత్ తండ్రి రామ్కుమార్ మాట్లాడుతూ.. ” మా కుమారుడిని పది రోజుల వ్యవధిలో ఇప్పటికి ఐదుసార్లు పాము కాటేసింది. అది కూడా ఒకే చోట కాటు వేయడంతో దానిని నుంచి తప్పించుకోడానికి ఇంటిలోనూ షూ ధరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ క్షణంలో పాముకాటు కారణంగా తమ కొడుకు చనిపోతాడేమో ఆందోళనగా ఉందని” అని తెలిపాడు. ఇక, ఈ విషయం తెలిసిన గ్రామస్థులు, చుట్టుపక్కల వారు రజత్ ఇంటికి పెద్ద సంఖ్యలో పరామర్శకు వస్తున్నారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.