తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం రేపుతున్న డ్రగ్స్ వ్యవహారాన్ని ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం హీరో నవదీప్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ నవదీప్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. మనీ లాండిరింగ్, బ్యాంక్ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుసుంది. అయితే ‘ఎఫ్ క్లబ్’పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం.
ఈ పబ్లో తరచూ సినీ ప్రముఖులు పార్టీలు నిర్వహించేవారని సమాచారం. ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులైన కెల్విన్, జీషాన్లు తరచూ ఈ పార్టీలకు హాజరైయ్యేవారని గతంతో ఎక్సైజ్ అధికారుల విచారణలో తెలింది. మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్ను కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మీ, హీరోయిన్ రకుల్ ప్రీత సింగ్, హీరో రానా, రవి తేజ, నందు విచారణకు హాజరయ్యారు.