ఈ మధ్య కాలంలోని యువత చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రియుడు వదిలేశాడని, తల్లిదండ్రులు మందలించారని, పరీక్షలో ఫెయిల్ అయ్యానంటూ ఇలాంటి కారణాలతో చాలా మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ యువతి ఆత్మహ్యకు పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగింది? యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మిదేవిపేటలో రమేష్, కవిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి సాత్విక (18) అనే కూతురు ఉంది. ఈ యువతి చిన్నప్పటి నుంచి చదువుల్లో బాగా రాణిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. అయితే ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన సాత్విక మంచి మార్కులతో పాసైంది. ఇక బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుక మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సీటు కూడా వచ్చింది. దీంతో ఆ యువతి కూడా బాగా సంతోషపడింది. కానీ ఆ యువతి సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు.
విషయం ఏంటంటే? కూతురుకి గ్వాలియర్ లో సీటు రావడంతో తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు. కానీ కూతురుని అంత పెద్ద కాలేజీలో చదివించడానికి ఆ దంపతుల దగ్గర డబ్బులు లేవు. దీంతో సాత్వికను స్థానింకగా ఉండే ఏదైన కాలేజీలో చదివించాలని అనుకున్నారు. ఇదే విషయం కూతురు సాత్వికకు తెలిసింది. తల్లిదండ్రులు ఇక్కడే చదివించాలని అనుకుంటున్నారని తెలిసి తీవ్ర మనస్థాపానికి గురైంది. తాను కోరుకున్న కాలేజీలో సీటు వచ్చినా.. చదువుకునే స్థోమత లేకపోవడంతో సాత్విక తనలో తాను కుమిలిపోయింది.
దీంతో సాత్వికకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి బుధవారం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయాత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన ఆ యువతి తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం సాత్విక ప్రాణాలు కోల్పోయింది. ఇక కూతురు మరణించడంతో రమేష్, కవిత దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.