ఆ యువతికి చదువంటే ఎంతో ఇష్టం. ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడాలనేది ఆమె కల. అందుకోసం ఆ యువతి ఈ మధ్యకాలంలోనే గుంటూరులో బీటెక్ కూడా పూర్తి చేసింది. ఇక హైదరాబాద్ లో తమ బంధువులు ఉండడంతో ఆ యువతి అక్కడికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆ యువతి తమ బంధువుల ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంది. అయితే ఈ మధ్య బీటెక్ పూర్తి చేసిన ఈ యువతి నగరంలో జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంది. కట్ చేస్తే.. తాజాగా ఆ యువతి ఉంటున్న బిల్డింగ్ పెంట్ హౌస్ లోకి మధ్యాహ్నం ఒంటరిగా వెళ్లింది. ఆ తర్వాత జరిగిన అక్కడ జరిగిన సీన్ ను బంధువులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు ఆ యువతి ఒంటరిగా ఖాళీగా ఉన్న పెంట్ హౌస్ లోకి ఎందుకు వెళ్లింది? అక్కడ ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి శిరీష. వయసు 22 ఏళ్లు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ఈ యువతి తల్లిదండ్రులతో పాటు ఉంటూ ఇటీవలే బీటెక్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్ కు వెళ్లాలనుకుంది. ఇక అనుకున్నదే ఆలస్యం.. శిరీష ఇటీవల కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద ఉంటున్న తమ బంధువుల ఇంట్లో దిగింది. ఆ తర్వాత ఆ యువతి కొన్ని రోజుల నుంచి జావా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉంది. ఇక శిరీష వచ్చిన నాటి నుంచి బంధువులతో సంతోషంగానే గడిపింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, గురువారం మధ్యాహ్నం బంధువులు ఉంటున్న బిల్డింగ్ పెంట్ హౌస్ లోకి ఒంటరిగా వెళ్లింది. శిరీష వెళ్తూ వెళ్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తీసుకెళ్లింది.
ఆ యువతి ఆ పెంట్ హౌస్ లోకి వెళ్లగానే తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె బంధువులు పెంట్ హౌస్ లోకి వెళ్లి మంటలు పూర్తిగా ఆర్పి వేశారు. ఆ తర్వాత వెంటనే బంధువులు శిరీషను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోవడంతో శిరీష అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఇక కూతురు మరణ వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. శిరీష ఆత్మహత్యకు ఇదే కారణమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.