ఆమెకు 30, అతడికి 65 ఏళ్లు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న మహిళకు ఆ వృద్ధుడితో పరిచయం పెంచుకుంది. వీరిద్దరి పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళ 65 ఏళ్ల ముసలోడితో బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు తన ముసలి ప్రియుడు బాగా క్యాష్ పార్టీ అని తెలుసుకుంది. ఆ తర్వాత జరిగిన అసలు కథతో ముసలోడు నెత్తి, నోరు బాదుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందంటే? 30 ఏళ్ల రాజీ అనే మహిళ కేరళ త్రిసూర్ పరిధిలోని తిప్పిలసేరిలో నివాసం ఉంటుంది. ఈ మహిళ స్థానికంగా ఓ బ్యూటీ పార్లర్ నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ క్రమంలోనే తన స్నేహితుడి ద్వారా రాజీకి నవ్వక్కాడ్ ప్రాంతానికి చెందిన 71 ఏళ్ల వృద్ధుడితో పరిచయం ఏర్పడింది. పైగా ఆ వృద్ధుడు బాగా క్యాష్ పార్టీ అని తెలుసుకుంది. ఇక ఇంకేముంది ఆ మాయలేడి రాజీ ఆ 65 ఏళ్ల ముసలోడితో చీకటి సంసారానికి తెర లేపింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఆ వృద్ధుడు కూడా చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా ఆ మహిళతో సరసాలకు కాలుదువ్వేవాడు.
అలా వీరి సీక్రెట్ కాపురం కొన్నిరోజులు గడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ప్రియురాలు రాజీ తన రూట్ ను పూర్తిగా మార్చేసింది. తన ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు సీక్రెట్ గా వీడియోలు, ఫోటోలు తీసుకుంది. అలా తీసుకున్న ఆ వీడియోలను తన ముసలి ప్రియుడికి చూపించి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగింది. ఆ వీడియోలు చూసిన ఆ వృద్ధుడు భయంతో చేసేదేం లేక అలా అనేక సార్లు ప్రియురాలు రాజీకి దాదాపుగా రూ.50 లక్షలు వరకు ముట్టజెప్పినట్లుగా తెలుస్తోంది. అలా ఇంతటితో ఆగని ఈ మాయలేడి రాజీ.. ప్రియుడిని మరిన్ని డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగింది. దీంతో నా వల్ల కాదని భావించిన ఆ వృద్ధుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళను విచారించారు. నేరం రుజువు కావడంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.