పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు అనూష. మూడు నెలల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన నాటి నుంచి నవ దంపతులు సంతోషంగానే జీవిస్తున్నారు. ఇక అంతా బాగానే ఉందనే క్రమంలోనే ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. పెళ్లైన మూడు నెలలకే ఈ నవ వధువు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అంతలా దారి పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కేరళలోని ఇడుక్కి జిల్లా కున్నం సమీపంలోని కొల్లపల్లి. ఇదే గ్రామానికి చెందిన మాథ్యూస్ అనే యువకుడు స్థానికంగా ఉండే అనూష అనే యువతిని ప్రేమించాడు. అనూష కూడా అతని ప్రేమను అంగీకరించింది అతనితో ప్రేమాయణాన్ని నడిపించింది. అలా కొంత కాలం పాటు వీరిద్దరు ప్రేమ విహారంలో తేలియాడుతూ సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక అనుకున్నట్లుగానే ఈ ప్రేమికులు ఆగస్టు 18న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లైన అనంతరం ఈ నవ దంపతులు కొల్లపల్లిలోనే నివాసం ఉండేవారు. అలా వీరి కాపురం సాఫీగా సాగుతుందనే క్రమంలోనే ఈ యువతి మానసిక ఒత్తిడితో బాధపడిందని తెలుస్తోంది.
ఆ టార్చర్ రోజు రోజుకు ఎక్కువవడంతో అనూష తట్టుకోలేకపోయింది. ఈ ఒత్తిడి భరించలేని అనూష ఊహించని నిర్ణయం తీసుకుంది. గత బుధవారం అనూష ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త మథ్యూస్ కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.., ఆ మహిళ మరణించిందని నిర్ధారించారు. ఇక అనూష మరణించడంతో ఆమె భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే అనూష మరణానికి మానసిక ఒత్తిడే కారణమా? లేక మరేదైన కారణమా దాగి ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.