జూన్ 26, 2022
కేరళ, ఏర్నాకుళం జిల్లాలోని కలాడికి చెందిన 52 ఏళ్ల పద్మ ఇంటినుంచి బయటకు వెళ్లింది. రోజులు గడుస్తున్నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెలలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి రాలేదు. నెలలు గడిచాయి. సెప్టెంబర్ 26వ తేదీన అదే ప్రాంతానికి చెందిన రోస్లిన్ అనే 50 ఏళ్ల మహిళ ఇంటినుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే రోస్లిన్ సెల్ఫోన్ సిగ్నల్స్ను ట్రేస్ చేశారు. అప్పుడు వారికి పాతానమ్తిట్టలోని భగవత్ సింగ్ ఇంటిపై అనుమానం కలిగింది. దీంతో ఇంటి చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు.. ఎవరు పోతున్నారో పరిశీలించారు.
అప్పుడు పద్మ ఓ వ్యక్తితో కారులో వెళ్లటం గుర్తించారు. ఆ కారు నెంబర్ ఆధారంగా షఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో షఫీ అలియాస్ మహ్మద్ షఫీ మొదట ఎలాంటి విషయాలు చెప్పలేదు. తనకేమీ తెలియదు అని అన్నాడు. అయితే, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. మహ్మద్ షఫీ ఓ సైకోపాత్. అతడికి కోర్కెలు చాలా ఎక్కువ. ఆ కోర్కెలు సాధారణ మనుషుల కంటే భిన్నంగా క్రూరంగా ఉండేవి. కోర్కెలు తీర్చుకోవటంలో తన షాడిజాన్ని బయటపెట్టేవాడు. ఈ నేపథ్యంలోనే తన భార్య ఫోన్ నెంబర్తో ఫేస్బుక్ను ఓపెన్ చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికోసం అన్వేషించటం మొదలుపెట్టాడు.
అప్పుడే అతడికి పాతానమ్తిట్టకు చెందిన భగవత్ సింగ్, లైలా దంపతులు పరిచయం అయ్యారు. తన మాయమాటలతో వారిని షఫీ బుట్టలో వేసుకున్నాడు. నర బలి ఇస్తే సంపద కలుగుతుందని నమ్మించాడు. ఆ దంపతులు షఫీ మాటలు నమ్మారు. నర బలులకు ఒప్పుకున్నారు. ఇక, నర బలుల కోసం షఫీ తనకు ముందుగానే పరిచయం ఉన్న పద్మ, రోస్లిల్లను ఎంచుకున్నాడు. మొదట పద్మను ట్రాప్ చేశాడు. సెక్స్ వర్క్ కోసం 15 వేలు ఇస్తానని, తనతో పాటు రావాలని ఆమెను అడిగాడు. ఆమె సరేనంది. జూన్ 26వ తేదీన అతడితో పాటు వెళ్లింది. పద్మ, షఫీలు పాతానమ్తిట్టలో ఉన్న భగవత్ సింగ్ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత షఫీ, భగవత్, లైలాలు పద్మను బంధించారు. ఆమె చేతులు, కాళ్లు కట్టేశారు.
జూన్ 28, 2022
సాయంత్రం ఆరు గంటలు సమయం..
కాళ్లు, చేతులు కట్టేసిన పద్మపై షఫీ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె ప్రైవేట్ పార్టులోకి కత్తిని జొప్పించాడు. అనంతరం కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. పద్మ చనిపోయిన తర్వాత భగవత్ ఆమె రొమ్ము భాగాల్ని కత్తితో కోసి, పక్కకు తీశాడు. అనంతరం 56 భాగాలుగా కత్తిరించారు. వీటిలో కొంతను ముగ్గురూ తిన్నారు. అనంతరం ఇంటి ప్రాంగణంలో వాటిని పూడ్చిపెట్టారు. సెప్టెంబర్ 26వ తేదీన బ్లూఫిల్మ్స్లో నటిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తానని షఫీ.. రోస్లిన్ను నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన రోస్లిన్ అతడితో పాటు పాతానమ్తిట్టలో ఉన్న భగవత్ ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లగానే పద్మను బంధించినట్లే రోస్లిన్ కూడా బంధించారు. ఆమె చేతులు కాళ్లు కట్టేశారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో షఫీ ఆమె ప్రైవేట్ పార్టులోకి కత్తిని జొప్పించాడు.
అనంతరం కత్తితో ఆమె గొంతుకోసి చంపేశాడు. రోస్లిన్ చనిపోయిన తర్వాత భగవత్ ఆమె రొమ్ము భాగాల్ని కత్తితో కోసి, పక్కకు తీశాడు. తర్వాత శరీర భాగాల్ని 56 భాగాలుగా కత్తిరించారు. వీటిలో కొంతను ముగ్గురూ తిన్నారు. అనంతరం ఇంటి ప్రాంగణంలో పూడ్చిపెట్టారు. విచారణలో షఫీ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు భగవత్, లైలాలను అదుపులోకి తీసుకున్నారు. షఫీ కారణంగానే తాము ఇలా చేసినట్లు దంపతులు తెలిపారు. పోలీసులు షఫీని ఏ1 గా తేల్చారు. ఇక, క్షద్రపూజల్లో భాగంగా మహ్మద్ షఫీ.. భగవత్ భార్య లైలాపై కూడా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అది కూడా భర్త కళ్లెదుటే ఈ దుశ్చర్య జరిగినట్లు సమాచారం. భగవత్ అంగీకారం మేరకే ఈ తతంగం జరిగినట్లు తెలుస్తోంది.