మద్యం మత్తులో కొందరు వ్యక్తులు దేనికైన తెగిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా విర్రవీగి ప్రవర్తిస్తూ ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కొడుకు కన్న తల్లి రెండో పెళ్లికి సహకరించడం లేదని తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మోగ.
ఇదే గ్రామంలో ఓ తల్లీకొడుకు నివాసం ఉంటున్నారు. మద్యానికి బానిసైన కొడుకు ప్రతీ రోజు తల్లితో గొడవకు దిగేవాడు. అయితే ఇతనికి గతంలోనే ఓ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి తన తల్లితో రెండో పెళ్లి చేయాలని గత కొంత కాలం నుంచి గొడవ పడుతున్నాడు. అలా రోజు అతిగా మద్యం తాగి వచ్చి రెండో పెళ్లి విషయంపై తల్లితో వాగ్వాదానికి దిగేవాడు. అయితే ఆ మహిళ కుమారుడు ఇటీవల ఓ రోజు ఫుల్ గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు. ఇక వస్తూ వస్తూనే తల్లితో పెళ్లి విషయంపై గొడవపడ్డాడు. నాకు ఖచ్చితంగా రెండో పెళ్లి చేయాల్సిందే అంటూ అరిచాడు. దీంతో తల్లి కూడా అతనిపై మాటల దాడికి దిగింది.
ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన కుమారుడు ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లిని కిరాతకంగా నరికి చంపాడు. దీనిని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రెండో పెళ్లి చేయడం లేదని తల్లిని దారుణంగా హత్య చేసిన దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.