అది ఓ అందమైన కుటుంబం. బాగా చదువుకుంటున్న పిల్లలు, అందంగా సాగుతున్న కాపురం. శత్రువుల సైతం ఈర్శపడేలా జీవించారు. చక్కగా సాగుతున్న వీరి కాపురాన్ని చూసి భార్యాభర్తలు తమలో తామే సంతోషపడ్డారు. ఈ జీవితానికి ఎంతకంటే ఇంకేం కావాలి అనుకున్నారు. కానీ ఒక్కప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న వీరి సంసారంలో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. దీంతో అప్పులను కుప్పలుగా చేశారు. ఇచ్చిన అప్పు తీర్చాలంటూ ఒత్తిడి పెరుగుతున్న క్రమంలోనే జీవితంపై ఈ దంపతులు విరక్తి చెందారు, చివరికి కుటుంబమంతా ప్రాణాలతో లేకుండా పోయారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ విషాద ఘటనతో స్థానికుల కంట కన్నీరు ఆగడం లేదు.
అసలేం జరిగింది? ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా కృష్ణానగర్లో ఆకోజి కృష్ణమూర్తి (42), శైలజ (32) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు ఆశ్రిత్, కూతురు గాయత్రి సంతానం. భర్త బంగారు అభరణాల షాపును నడిపిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పిల్లలు బాగా చదువుకుంటుడంతో వారి కాపురం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి ఇతని వ్యాపారంలో నష్టాలు రావడంతో కృష్ణమూర్తి తెలిసిన వారి వద్ద రూ.30 లక్షల అప్పు కూడా చేశాడు. ఇక ఈ క్రమంలోనే కృష్ణమూర్తి తండ్రి కూడా మరణించాడు. ఇక రోజుల నుంచి నెలల గడిచాయి. అప్పు ఇచ్చిన వ్యక్తులు ఫోన్లు చేస్తూ.. అప్పు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ టార్చర్ పెడుతున్నారు.
ఆ సమయంలో కృష్ణమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆస్తులను అమ్మి అప్పులు తీర్చుదామన్నా.. తాతలు, తండ్రి సంపాదించిన ఆస్తులు కూడా లేవు. వీరిని ఆదుకోవడానికి బంధువులు కూడా ముందుకు రాలేదు. అప్పు ఇచ్చిన వ్యక్తుల నుంచి ఒత్తిడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తి భార్యాభర్తలకు జీవితంపై విరక్తి కలిగింది. ఇలాంటి బతుకు వద్దని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఆగస్టు 21న రాత్రి పూట కుటుంబంలోని నలుగురు పురుగుల మందు తాగారు.
పక్కింటి వారు గమినించి వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ 23 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు కుటుంబంలోని నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనలో మీరు తెలుసుకున్నదేంటి? ఇలాంటి వారికి మీరిచ్చే భరోసా ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.