ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్న వార్తలు వింటూనే ఉన్నాం. దారుణంగా చిన్న పిల్లలను, వృద్దులను కూడా వదలడం లేదు కామాంధులు. ఓ గురువు స్థానంలో ఉంటూ పదమూడు మంది విద్యార్థినులపై అత్యాచారం చేసిన ఓ కీచక ఉపాధ్యాయుడికి జీవితకాల శిక్ష ఖరారైంది. వివరాల్లోకి వెళితే.. హెర్రీ విరావాన్, వయసు 36 ఏళ్లు. ఇతరు 13 మంది విద్యార్ధినులను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇవాళ వెస్ట్ జావాలోని బండుంగ్ జిల్లా కోర్టు తీర్పును వెలువరించింది. హెర్రీ విరావాన్ పైకి అందరితో బాగా మాట్లాడుతూ.. మంచితనంతో మెలిగేవాడు.
ఇది చదవండి: కనిపించకుండా పోయిన బాలిక.. రక్తపు మడుగులో..
ఇతని కామ దృష్టి 11 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలపైనే ఉండేది. ఆ వయసు ఉన్న అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు. మత ప్రబోధకుడిగా స్కూల్ను నడుపుతున్న అతను 2016 నుంచి ఘోరానికి పాల్పడ్డాడు. రేప్కు గురైన బాలికల్లో 8 మంది గర్భం దాల్చారు. ఆ అమ్మాయిలు 9 మంది చిన్నారులకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. రసాయనాలతో వృషణాలను నిర్వీర్యం చేయాలని కూడా డిమాండ్ చేశారు. కాకపోతే ఆ డిమాండ్లను కోర్టు తిరస్కరించింది. స్కాలర్షిప్లు ఇస్తామంటూ ఆ టీచర్ అమ్మాయిలను ఆకర్షించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి బాధితురాలికి ఇండోనేషియా ప్రభుత్వం ఆరువేల డాలర్లు చెల్లించనున్నది.