చింత చచ్చినా పులుపు చావదు అంటే ఇదేనేమో. ఓ 89 ఏళ్ల వృద్దుడు తన భార్యను టార్చర్ పెడుతున్నాడు. భర్త వేధింపులను భరించలేని ఆ పండు ముసలవ్వ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని వదోదరలో ఓ వృద్ద దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ దంపతులు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా సంతోషమైన జీవితాన్ని గడిపారు.
ఇక ఇంత వరకు బాగానే ఉన్నా.. గత కొన్ని రోజుల నుంచి ఆ 89 ఏళ్ల వృద్దుడు తన భార్య అయిన 87 ఏళ్ల ముసలవ్వను టార్చర్ పెడుతున్నాడు. రాత్రి పూట భర్త పెట్టే పోరును భార్య తట్టుకోలేకపోయింది. కొన్ని రోజులు వేచి చూసినా.. భర్త అస్సలు తగ్గకుండా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. ఇక భర్త వేధింపులను తట్టుకోలేని ఆ ముసలవ్వ చేసేదేం లేక హెల్ప్ లైన్ ను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన ఆ హెల్ప్ లైన్ బృందం వారి ఇంటికి చేరుకుని ఇద్దరికీ కౌన్స్ లింగ్ ఇచ్చారు. యెగా, వ్యాయామాలు చేయాలని ఆ వృద్ద దంపతులకు సూచించారు.
ఇదే కాకుండా మీకు నచ్చిన మతపరమైన ప్రదేశాలను సందర్శించి ఆనందమైన జీవితాన్ని గడపాలని వారు తెలిపారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రముఖ సైకలాజిస్టుతో వీరిని చూపించాలని హెల్ప్ లైన్ బృందం వారికి పలు సూచనలు చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా ప్రవర్తించిన ఈ 89 ఏళ్ల వృద్దుడు తీరును మీరు ఏకీభవిస్తారా? ఆయనకి మీరు ఎలాంటి సూచనలు చేయాలనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.