ఎంతో ప్రశాంతంగా ఉన్న పోలీస్ స్టేషన్ లోకి ఒకేసారి 100 మంది హిజ్రాలు దూసుకొచ్చారు. కట్టగట్టుకుని అంతమంది ఒక్కసారిగా రావడంతో పోలీసులు సైతం భయపడిపోయారు. డబ్బుల కోసం వచ్చారేమో అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. అయితే మరి ఒకేసారి అంతమంది హిజ్రాలు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పో గోదావరి జిల్లాలోని యానంలో చాలా మంది హిజ్రాలు సంచరిస్తున్నారు.
కాగా గత కొంత కాలం నుంచి యానంలోని కొందరు యువకులు హిజ్రాలను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై యానంలో ఉన్న హిజ్రాలు అందరూ ఏకమై శనివారం కోరంగి పోలీస్ స్టేషన్ ను ముట్టడించి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. మాపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైన వారి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు.
ఇక ఇటీవల ఆపరేషన్ చేసుకున్న ఓ హిజ్రాపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించారని, అడ్డుకోబోయిన మాపై మమ్మల్ని కర్రలతో, రాళ్లతో దాడులకు తెగ బడుతున్నారని హిజ్రాలు తెలిపారు. దీంతో పాటు మా వద్ద ఉన్న పర్సులు, డబ్బులు కూడా లాక్కెళ్ళిపోతున్నారని హిజ్రాలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామని హిజ్రాలకు హామీ ఇచ్చారు. ఇటీవల చోటు చేసుకుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.