ఈ రోజుల్లో చాలా మంది పెళ్లైన మహిళలు కట్టుకున్న భర్తను కాదని మరో మగాడితో వివాహేతర సంబంధాన్నిపెట్టుకుంటున్నారు. ఇక తన ఇంటి రుచి కన్న పక్కంటి పుంటికూర రుచి వేరన్నట్లుగా రెచ్చిపోయి హద్దులు దాటుతున్నారు. భర్త లేని టైమ్ లో ప్రియుడిని ఏకంగా ఇంట్లోకి రప్పించుకుని బెడ్ రూంలోనే దుకాణం పెట్టేస్తున్నారు. సరిగ్గా ఇలాగే పరాయి మగాడి కోసం దారులు వెతికిన ఓ మహిళ ఒకరిని కాదు, ఏకంగా ఇద్దరితో సీక్రెట్ గా సెటప్ పెట్టేసింది. ఇంతటితో ఆగకుండా ప్రియుడిని మరో ప్రియుడితో హత్య చేయించింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నగరంలో సాలిగ్రామం. ఇక్కడే శారదంబాల్ వీధిలో సౌందర్య అనే మహిళ నివాసం ఉంటూ.. కొడంభక్కం ప్రాంతంలో పారుశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. ఆమెకు గతంలోనే పెళ్లైంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. కొంత కాలం నుంచి సౌందర్య భర్తకు దూరంగా కాపురం పెట్టింది. అలా తనంతట తాను జీవితాన్ని నెట్టుకొస్తూ ఒంటరి జీవితాన్ని గడిపేస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఓ మగ తోడు కోసం ఎదురు చూసిన సౌందర్యకు స్థానికంగా ఉండే విజయ్ (27) అనే యువకుడు పరిచయమయ్యాడు.
ఈ పరిచయమే రాను రాను ఇద్దరు వివాహేతర సంబంధంగా తీర్చిదిద్దుకున్నారు. అలా సౌందర్య తన ప్రియుడితో అడ్డు అదుపు లేకుండా రొమాన్స్ లో హద్దులు దాటి ఎంజాయ్ చేసింది. అలా కొన్నాళ్ల పాటు వీరి చీకటి కాపురం ఘనంగా సాగింది. ఇదిలా ఉంటే సౌందర్య విజయ్ తోనే కాకుండా ప్రభు అనే యువకుడితో సైతం అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం విజయ్ కు తెలియకుండా సౌందర్య తగు జాగ్రత్తలు పాటించింది. కానీ కొంత కాలానికి ప్రభుకి సౌందర్యతో విజయ్ అనే యువకుడు తిరుగుతున్నాడని తెలుసుకున్నాడు.
దీంతో సౌందర్యని కలవకుండా ఉండాలంటే.. విజయ్ ని ప్రాణాలతో లేకుండా చేయాలని ప్రభు ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే ప్రభు సమయం కోసం ఎదురు చూశాడు. అయితే శుక్రవారం రాత్రి విజయ్, సౌందర్య ఏకాంతంగా కలుసుకున్నారు. ఇదే మంచి సమయం అనుకున్న ప్రభు.., వారిద్దరున్న ఇంట్లోకి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూనే ప్రభు విజయ్ ను దారుణంగా హత్య చేశాడు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో మాత్రం.. సౌందర్యే ప్రియుడు ప్రభుతో చేతులు కలిపి విజయ్ ని హత్య చేసినట్లుగా తేలింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.