ఓ భర్త భార్యను నల్లగా ఉన్నావంటూ గత కొంత కాలంగా టార్చర్ పెడుతున్నాడు. కట్టుకున్న మొగుడే కదా.., సరదాగా అంటున్నాడేమోనని భార్య పట్టించుకోవడం మానేసింది. అలా కొన్ని రోజుల పాటు భర్త భార్యను అందరి ముందు నల్లగా ఉన్నావంటూ హేళన చేస్తూ మాట్లాడేవాడు. రాను రాను భర్త విర్రవీగి ప్రవర్తించడంతో భార్య కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. పట్టరాని ఆవేశంతో ఊగిపోయిన భార్య.., భర్తను గొడ్డలితో నరికి చంపింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
అది ఛత్తీస్ ఘడ్ లోని దుర్గ్ జిల్లా అమలేశ్వర్ ప్రాంతం. ఇక్కడే అనంత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ అనారోగ్య కారణాలతో అతని భార్య మరణించింది. దీంతో అనంత్ కొన్నాళ్లకి సంగీత అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలం పాటు అనంత్ భార్యను బాగానే చూసుకున్నాడు. కానీ రోజులు మారే కొద్ది అంకిత్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. భర్త అంకిత్ సంగీత కలర్ గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ భార్యను హేళన చేస్తుండేవాడు. సంగీత మాత్రం భర్త సరదాగా అంటున్నాడేమోనని విని విననట్లుగా వదిలేసింది.
అయితే రాను రాను భర్త అంకిత్ అందరి ముందు భార్య కలర్ గురించి మాట్లాడేవాడు. ఇక అనేక సార్లు భర్త అలా హేళన చేయడంతో భార్య తీవ్ర మనస్థాపానికి లోనయ్యేది. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే భర్త అంకిత్ భార్యను నల్లగా ఉన్నావంటూ ఆమె కలర్ గురించి మాట్లాడాడు. ఇదే విషయమై భార్యాభర్తలిద్దరూ మాటల దాడి చేసుకున్నారు. ఇక భర్త పదేపదే తన కలర్ గురించి మాట్లాడడంతో తట్టుకోలేకపోయిన సంగీత.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను ముక్కలు ముక్కులుగా నరికి దారుణంగా హత్య చేసింది.
ఇక ఉదయం కాగానే నా భర్తను ఎవరో చంపారంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు భార్యను ఏం జరిగిదంటూ విచారించారు. నాకేం తెలియదంటూ చెబుతూనే చివరికి నేనే హత్య చేశానంటూ ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య సంగీతను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. సంగీత చేసింది ముమ్మాటికి కరెక్ట్. శభాష్ సంగీత అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.