ఈ మధ్యకాలంలో చాలా మంది అడ్డదారిలో సులభంగా డబ్బును సంపాదించే మార్గాలు వెతుక్కుంటున్నారు. కష్టపడి చెమటోడ్చం కాకుండా తక్కువ వ్యవధిలోనే లక్షలు పోగుచేయాలని చూస్తున్నారు. అచ్చం ఇలాంటి దారిలోనే వెళ్లిన ఓ దంపతులు పాడు పనికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని పట్నం బాట పట్టిన అనేక మంది యువతులను టార్గెట్ చేసుకున్నారు. ఈ దంపతులు ఆ యువతులపై కీచక పర్వానికి తెర లేపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? చెన్నై నగరంలోని అప్పర్ నగర్ లో సతీష్ కుమార్, సరళ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. ఎన్నో కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. కానీ ఎక్కడ కూడా వారికి సరిపడ సంతృప్తి అనిపించలేదు. అంతే.. ఇక ఈ దంపతులు రూట్ మార్చారు. ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన అమ్మాయిలనే వీరు టార్గెట్ గా చేసుకున్నారు. వీరిని ఆసరా చేసుకుని డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇందులో భాగంగానే ఉద్యోగాల కోసం పట్టణానికి వచ్చిన అందమైన యువతులకు మాయ మాటలు చెబుతారు.
మీకు ఉద్యోగం వచ్చేంత వరకూ మా ఇంట్లోనే ఉండండి అంటూ నమ్మిస్తారు. మీకు ఏం కావాలన్నా మేము చూసుకుంటాం అంటూ ఇలా ఎన్నో మోసపూరిత మాటలు వల్లించి ఇంట్లోకి రప్పించుకుంటారు. ఈ దంపతులను నమ్మిన అనేక మంది యువతులు వారి ఇంట్లోకి వచ్చారు. అలా వచ్చిన అనేక మంది యువతులను ఓ గదిలో బందిస్తారు. ఆ తర్వాత విటులను పిలిపించి వారిపై బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు.
ఇక ఇంతటితో ఆగకుండా ఆ అమ్మాయిలు వారితో ఏకాంతంగా కలిసున్న సమయంలో వీడియోలు తీసి ఆ అమ్మాయిలను బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. ఇలా ఎంతో మంది యువతులను మోసం చేసిన ఈ దంపతులు బ్లాక్ మెయిల్ కు దిగి వ్యభిచారంలో అడ్డుగోలుగా సంపాదించారు. అయితే ఇదే విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లింది. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దారుణానికి పాల్పడుతున్న ఈ దంపతులను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కిలాడి దంపతులను విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.