బ్రిజిల్ దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఓ నిండు గర్భిణి మహిళను హత్య చేశారు. అనంతరం ఆ దుండగులు మహిళ కడుపును కోసి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలంగా మారుతోంది. బ్రిజిల్ లోని కొన్ని మీడియా కథనాల ప్రకారం.. సావో పాలోలోని పోర్టల్ డాస్ లాగోస్ లో నగరం. ఇక్కడే ఒహానో కరోలిన్ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త నుంచి విడిపోయిన కరోలిన్ కొంత కాలం నుంచి ప్రియుడితోనే ఉంటుంది. అయితే నిండు గర్భవతి అయిన కరోలిన్ సెప్టెంబర్ 21న పోర్టల్ డాస్ లాగోస్లో ఓ కారులో కూర్చుని ఉంది.
ఆమె కారులో కూర్చుని ఉండడాన్ని కొందరు దుండగులు గమినించారు. తర్వాత ఆమె వద్దకు వెళ్లారు. అనంతరం ఆమెను కత్తులో దారుణంగా హత్య చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా ఆమె కడుపు కోసి కడుపులో ఉన్న బిడ్డను ఎత్తుకెళ్లారు. దీనిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో మాత్రం.., దుండగులు ఆమె కడుపులో ఉన్న బిడ్డను బలి ఇవ్వడానికి ఆమె కడుపు కోసి తీసుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.