ఈ రోజుల్లో చాలా మంది భర్తలు ఇంట్లో భార్య ఉండగా మరో మహిళతో రొమాన్స్ ను కోరుకుంటున్నారు. పరాయి మహిళతో చీకటి సంసారానికి పావులు కదుపు వివాహేతర సంబంధాన్ని బలపర్చుకుంటున్నారు. అయితే అచ్చం ఇలాగే భార్యకు తెలియకుండా అక్రమ సంబంధానికి జెండా ఊపిన ఓ భర్త కథలో చివరికి భార్య చేతిలో భర్త కుక్కచావు చచ్చాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన అబ్దుల్ బాషా(34), ఆయేషా దంపతులు.
వీరికి ఆరేళ్ల కిందట పెళ్లై ఓ కూతురు, కుమార్తె ఉన్నారు. భర్త అబ్దుల్ బాషా లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అలా కొంత కాలం పాటు బాషా తన కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోనే అబ్దుల్ బాషా మద్యానికి బానిసై చెడు మార్గాల వైపు దారులు వెతికాడు. ఇక మద్యంతోనే సరిపెట్టకుండా.., పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని రంజుగా సాగించడం మొదలు పెట్టాడు. సొంత కాపురాన్ని కాలదన్ని చీకటి కాపురాన్ని నెత్తినెత్తుకున్నాడు. ఇలా సమయం దొరికినప్పుడల్లా పరాయి మహిళలతో రొమాన్స్ లో రెచ్చిపోయేవాడు. అయితే ఇదే విషయం కొన్నాళ్లకి భార్య ఆయేషాకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు మొదలయ్యాయి.
ఇదిలా ఉండగా.., బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త అబ్దుల్ బాషా భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పెల్చుకున్నారు. ఇక భర్త ప్రవర్తనలో మార్పు రాదని గమనించిన భార్య ఆయేషా సంచలన నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి భర్త జోరునిద్రలోకి జారుకున్నాక ఇంట్లో ఉన్న రోకలి బండతో ఆయేషా భర్త తలపై దాడి చేసింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు. ఇక మరుసటి రోజు ఉదయం ఇరుగు పొరుగు వారు గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇలా భార్యను కాదని అక్రమ సంబంధాలు కోరుకునే ప్రతీమగాడికి ఇదే గతి పడుతుందని మహిళలు హెచ్చరిస్తున్నారు.