గనుల దిగ్గజం వేదాంతా గ్రూప్, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ కలిసి గుజరాత్ లో సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటుచేయనున్నాయి. ఇందుకోసం సంయుక్తంగా రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్లాంట్ నుంచి తయారీ ప్రారంభమైతే దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గే అవకాశముందని వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. ఎంతలా అంటే.. ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయలు పలుకుతోన్న ల్యాప్టాప్ను రూ.40 వేలకే కొనుక్కోవచ్చని తెలిపారు.
దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు తొలి అడుగులు పడ్డాయి. వేదాంతా గ్రూప్, ఫాక్స్ కాన్ కలిసి రూ.1.54 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్ లో ప్లాంటు ఏర్పాటుచేయనున్నాయి. అందుకోసం.. అహ్మదాబాద్ జిల్లాలో 1000 ఎకరాల భూమిలో సెమీకండక్టర్ ఫ్యాబ్ యూనిట్, డిస్ ప్లే ఫ్యాబ్ యూనిట్, సెమీకండక్టర్ అసెంబ్లింగ్-టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశీయంగా సెమీ కండక్టర్ చిప్ సెట్లు, డిస్ ప్లే తయారీ ప్రారంభమైతే, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గే అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ లో ల్యాప్టాప్ ధర రూ. లక్ష అనుకుంటే.. డిస్ ప్లే, చిప్ సెట్ల తయారీ దేశీయంగా ప్రారంభమయ్యాక, ఆ ల్యాప్టాప్ ధర రూ.40 వేలు.. లేదా అంతకన్నా తక్కువే ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.
చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకున్న వస్తువులపైనే ఎక్కువుగా ఆధారపడుతున్నాం. డిస్ ప్లేను తైవాన్, కొరియా నుంచి: చిప్ సెట్లను హాంకాంగ్, వియత్నాం, సింగపూర్, కొరియాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో 60:40 నిష్పత్తిలో వేదాంతా, పాక్స్ కాన్ పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ ప్లాంటు వల్ల లక్ష మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. మొదట ఈ ప్రాజెక్ట్ మహారాష్ట్రలో ఏర్పాటుకానున్నట్లు వార్తలొచ్చినప్పటికీ.. చివరకు గుజరాత్ కు చేరింది.
This project will help fulfil Hon’ble PM @narendramodi Ji’s vision of creating a robust manufacturing base in India. It will reduce our electronics imports & provide 1 lakh direct skilled jobs to our people…going from job seekers to job creators! (2/4)
— Anil Agarwal (@AnilAgarwal_Ved) September 13, 2022
India’s own Silicon Valley is a step closer now. #India will fulfil the digital needs of not just her people, but also those from across the seas. The journey from being a Chip Taker to a Chip Maker has officially begun…Jai Hind! 🇮🇳 (4/4)
— Anil Agarwal (@AnilAgarwal_Ved) September 13, 2022