తరగతి గదిలో తప్పుచేస్తే.. ఆ తరగతి ఉపాధ్యాయుడు దండించడం ఆనవాయితీ. అదే బ్యాంకులు తప్పుచేస్తే.. దేశంలో బ్యాంకుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు అతిక్రమించారో చర్యలు తీసుకోవడం ఖాయం. అలాంటి వార్తే ఇది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు, ఒక కో-ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ క్యాన్సల్ చేసింది.. ఆర్బీఐ. దీంతో ఆ బ్యాంకు మూతపడనుంది. ఆ వివరాలు..
భారతదేశంలోని అతి ముఖ్యమైన ఆర్థిక సంస్థలలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ)’ ఒకటి. దీనినే ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. ఇది అన్ని వాణిజ్య బ్యాంకుల మాతృ సంస్థ లాంటిది. డబ్బును పంపిణీ చేయడం, నియంత్రించడం లాంటివి దీని విధులు. అంతేకాదు.. దేశంలో డబ్బుకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్బిఐ నియంత్రిస్తుంది. దేశంలోని ఏ బ్యాంకు అయినా.. ఆర్బీఐ నిబంధనలకు లోబడే పనిచేయాలి. అలా కాదంటే.. జరిమానా విధంచడం, అంతకు మితిమీరితే.. లైసెన్స్ క్యాన్సల్ చేయడం చేస్తుంది.
నిభందనలు పాటించని రూపీ కోఆపరేటివ్ బ్యాంకు(పూణే) లైసెన్సును ఆర్బీఐ క్యాన్సిల్ చేసింది. మీరు ఒకవేళ ఈ బ్యాంకు కస్టమర్ అయితే.. మీ డబ్బులను విత్ డ్రా చేసుకునేందుకు సెప్టెంబర్ 22, 2022 వరకు గడువిచ్చింది. ఈ గడువులోగా రూపీ కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు తాము డిపాజిట్ చేసిన డబ్బులను విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ బ్యాంకు కస్టమర్ అయితే వెంటనే సెప్టెంబర్ 22వ తేదీ లోపల మీ సేవింగ్స్ బ్యాంకు అకౌంట్/ ఎఫ్డీ అకౌంట్ నుంచి డబ్బులను విత్ డ్రా చేసుకోండి. విత్ డ్రా లిమిట్ కూడా, ఆర్బీఐ సబ్సిడిరీ అయిన ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీజీ)’కు లోబడి ఉంటాయి.
‘రూపీ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్’ లైసెన్సును క్యాన్సిల్ చేస్తున్న విషయాన్ని ఆర్బీఐ గత నెల 10న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఆగస్టు 10 నుంచి ఆరు వారాల్లో ఈ బ్యాంకును మూసి వేయనున్నట్టు ఆ నోటిఫికేషన్ లో పేర్కొంది. అంటే సెప్టెంబర్ 22, 2022తో ఆ గడువు ముగియనుంది. ఆ తర్వాత ఈ బ్యాంకుకి చెందిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి మనీ విత్ డ్రా చేసుకోవడం కుదరదని పేర్కొంది. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.