పాన్- ఆధార్ అనుసంధానం చేశారా? చెయ్యకపోతే ఈరోజే పూర్తి చేయండి. ఎందుకంటే ఆధార్- పాన్ అనుసంధానానికి మార్చి 31 తుది గడువు. ఒక వేళ ఈలోపు అనుసంధానం చెయ్యకపోతే పాన్ పనిచేయడం ఆగిపోతుంది. అంతేకాదు రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆదాయపన్ను శాఖ ప్రకటించింది.
‘‘2022 జూన్ 30 వరకు పాన్–ఆధార్ లింకింగ్ చేసుకుంటే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనుసంధానించుకుంటే రూ.1,000 జరిమానా ఉంటుంది’’అని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో విడతలుగా పాన్–ఆధార్ లింకింగ్ గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరికి ఆలస్యపు రుసుములతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుసంధానించుకోవడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. దీంతో పన్ను రిటర్నులకు సంబంధించి పాన్ అందుబాటులో ఉండదు. కనుక పన్ను చెల్లింపుదారులు అందరూ ఒక్కసారి తమ పాన్, ఆధార్తో అనుసంధానమైందీ, లేనిదీ ఆదాయపన్ను శాఖ పోర్టల్కు వెళ్లి పరిశీలించుకోవాలి’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: మీ పేరుపై ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా.. అయితే బ్లాక్ అయినట్లే!గడువులోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. ఆలస్య రుసుము కింద రూ.1,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక బిల్లు 2021లో సవరణలు చేసి.. సెక్షన్ 234హెచ్ను ప్రభుత్వం కొత్తగా చేర్చింది. లింక్ చేయని.. పాన్ను ఐటీ సేవలకు వినియోగిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం.. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఆధార్ – పాన్ లింక్ చేయడం ఎలా?
ఎస్ఎంఎస్ ద్వారా..
మీ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎస్ఎస్ పంపడం ద్వారా కూడా పాన్-ఆధార్ లింక్ చేయొచ్చు. ఇందుకోసం UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి.. 12 అంకెల ఆధార్ నంబర్ను, 10 అంకెల పాన్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఈ మెసేజ్ను 567678 లేదా 56161కు పంపాలి. దీనితో పాన్-ఆధార్ లింక్ పూర్తవుతుంది.
లింక్ స్టేటస్ తెలుసుకొండిలా..
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్ ఆధార్ స్టేటస్పై క్లిక్ చేసి.. ఆధార్, పాన్ నంబర్లను ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా లింక్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా..
12 అంకెల ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి.. 10 అంకెల పాన్ నంబర్ను ఎంటర్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ పంపడం ద్వారా లింక్ స్టేటస్ను తెలుసుకోవచ్చు.