నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ తప్పక ఉంటుంది. ఏదో ఒక సమయంలో బ్యాంకులో పని పడటం, బ్యాంకుకు వెళ్లడం ఎప్పుడూ జరిగేవే. కాకుంటే.. ఇప్పటివరకూ మనకు నచ్చిన సమయంలో బ్యాంకుకు వెళ్ళేవాళ్ళం. ఇకపై అలా వెళ్తానంటే కుదరకపోవచ్చు. బ్యాంకు పనివేళల్లో, పని దినాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చిన బ్యాంకు ఉద్యోగులు.. ఇప్పుడు వారంలో ఐదు రోజులు పనిదినాలు కావాలని కోరుతూ ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) సంఘం ప్రభుత్వం ముందు కొన్ని కీలక ప్రతిపాదనలు ఉంచింది. అందులో ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేస్తుండగా.. ఆ పనివేళల్ని 5 రోజులకు కుదించాలన్నది ప్రధాన డిమాండ్. అలా పనిదినాల్ని 5 రోజులకు కుదించినందుకుగానూ రోజుకు మరో అరగంట అదనంగా పనిచేస్తామని పేర్కొంది. అలాగే.. పనివేళల్లో కూడా మార్పులు చేయాలని కోరింది.
బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రభుత్వం ముందుంచిన ప్రతిపాదనలు చూస్తే.. “ప్రస్తుతమున్న పని గంటలు ఉదయం 9:45 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు కాకుండా.. ఉదయం 9:15 నుండి సాయంత్రం 4.45 గంటల వరకు మార్చాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సవరించాలి. అలాగే.. నగదు రహిత లావాదేవీల వేళలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండాలని ప్రతిపాదించినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి”.
You @UFBUIndia know that there is no fixed time to leave branches in the evening & it will not be Beneficial to the management if increased 30minutes in evening. That’s why u compromised to open banks 30minutes earlier.
#Compromised #5daysbanking @ChairmanIba @AIBEA 👎#12thBPS pic.twitter.com/W2JKZfU3le— We Bankers Officers’ Association Punjab® (@webankerspunjab) October 13, 2022