ప్రస్తుతం ఎక్కడ చూసినా 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించే చర్చ. 4జీతో పోలిస్తే 10 రెట్ల అధిక వేగంతో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అల్ట్రా హైస్పీడ్, కోట్లాది డివైజెస్ తో రియల్ డేటా షేర్ చేసుకునే సదుపాయం ఉంటుంది. మంగళవారం (జులై 26) ఉదయం 10 గంటలకు ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రారంభం అయింది. సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. వేలం మిగిలి ఉంటే బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.4.3 లక్షల కోట్ల 72ghz సామర్థ్యమున్న 5జీ ఎయిర్ వేవ్స్ ను వేలం వేస్తున్నారు.
ఈ 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో, సునీల్ మిత్తల్ కు చెందిన భారతీ ఎయిర్ టెల్, వీఐ(వొడాఫోన్ ఐడియా), అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఈ వేలంలో 3 విభాగాలు ఉన్నాయి. తక్కువ(600ఎంహెజ్, 700 ఎంహెచ్ జెడ్, 800 ఎంహెచ్ జెడ్, 900 ఎంహెచ్ జెడ్, 1800 ఎంహెచ్ జెడ్, 2100 ఎంహెచ్ జెడ్ బ్యాండ్లు), మీడియం(3300 ఎంహెచ్ జెడ్ బ్యాండ్), ఎక్కువ (26 జీహెచ్ జెడ్ బ్యాండ్) ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను వేలం వేస్తున్నారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.