రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అసలే పెళ్లిల్ల సీజన్ కావడంతో బంగారానికి ఈ టైంలో విపరీతమైన డిమాండ్. కానీ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 50 వేలకు పైగా పెరగడంతో చాలా మంది కొనుగోలు ఆపేశారు.. ఆర్డర్లు క్యాన్సిల్ చేశారు. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప.. తగ్గని బంగారం ధరలు.. ఇవాళ ఒకేసారి భారీగా తగ్గాయి. దాదాపు వారం రోజుల తర్వాత తొలిసారి పసిడి ధర దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రామలు బంగారం ధర రూ.48,200కి పడిపోయింది. నిన్నటిలో పోల్చితే ఏకంగా రూ.1600 తగ్గింది. ఫలితంగా ఒక్క గ్రాము గోల్డ్ రేటు రూ.4,820కి దిగొచ్చింది.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్లోని వైద్యుడి కోసం మెగాస్టార్ చిరంజీవి ట్వీట్!
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, కేరళలో బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200గా ఉంది. చెన్నైలో రూ.48,850, పుణెలో రూ.48,250, జైపూర్,లక్నోల్లో రూ.48,350కి పడిపోయింది.24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారాన్ని పెట్టుబడులకు వినియోగిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారం రేటు రూ.52,580కి పడిపోయింది. నిన్నటితో పోల్చితే రూ.1750 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమై బంగారం రూ.5,258కి అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..! భారీగా పెరిగిన వంటనూనె ధరలు!బంగారం తో పాటు వెండి రేటు కూడా భారీగా పడిపోయిది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్రాము వెండి ధర రూ.741కి దిగొచ్చింది. నిన్నటితో పోల్చితే రూ.26 తగ్గింది. ఒక్క గ్రాము వెండి రూ.74.10గా ఉంటే.. కేజీ వెండి రూ.74,100కి అందుబాటులో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై, కోల్కతా, హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడలో వెండి ధరలు ఒకేలా ఉన్నాయి. ఇక్కడ గ్రాము వెండి ధర రూ.741గా ఉంది. ముంబై, న్యూఢిల్లీ, జైపూర్, లక్నోల్లో రూ.694కి లభిస్తోంది. బంగారం ధర 50 వేల దిగువకు పడిపోవడం జనాలకు ఊరట కలిగిస్తోంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.