తెలుగు టీవీ ప్రేక్షకులను గత ఐదేళ్లుగా ఎంటర్టైన్ చేస్తూ విజయవంతంగా కొనసాగుతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. ప్రస్తుతం బిగ్ బాస్ 5వ సీజన్ చివరిదశలో ఉంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలేలో 5వ సీజన్ విజేత ఎవరో తెలిసిపోనుంది. ఈసారి ఫినాలే ఉత్కంఠభరిత స్టేజికి చేరేసరికి ఎవరు గెలుస్తారా! అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం హౌస్ లో వీజే సన్నీ, సింగర్ శ్రీరామచంద్ర, మానస్, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ ఉన్నారు. అయితే ఇది చివరి వారం కావడంతో ఆరంభం నుండి ఓ కంటెస్టెంట్ టాప్లో ఉన్నట్లు తెలుస్తుంది. శుక్రవారంతో పోలింగ్ ముగియడంతో అసలు ఎవరు ఏ స్థానంలో ఉన్నారనే విషయం పై ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఇప్పుడున్న ఐదుగురి మధ్య పోరు ఆసక్తికరంగా సాగడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయారు. తాజాగా జరుగుతున్న సీజన్ టైటిల్ ఫేవరెట్లలో షణ్ముఖ్ ఒకడు. బయట భారీ ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్.. బిగ్ బాస్ విజేతగా నిలిచే అవకాశాలున్నాయనే టాక్ నడిచింది. కానీ అదే సమయంలో వీజే సన్నీ తనదైన ఆటతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. టాప్ 5లో ఉన్న అందరిలోనూ వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ మధ్య టైటిల్ పోటీ జరుగుతోంది అనుకున్నారు.
ఈ వారం ఫస్ట్ డే నుండే వీజే సన్నీ ఓటింగ్లో మొదటి స్థానంలో ఉన్నాడని.. ఇక షన్నూ సెకండ్ స్థానానికే పరిమితం అవ్వాల్సి ఉంటుందని టాక్. అలాగే వివాదాలకు దూరంగా ఉంటూ ప్రతి టాస్కులో మెప్పించిన మానస్ 4వ స్థానంలో ఉండగా.. ఫినాలేలో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ 5వ స్థానంలోనే ఉందని వినికిడి.
ఇక ఈ వారం శ్రీరామచంద్రకు మిస్డ్ కాల్స్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చాయట. హాట్స్టార్ లోనూ మంచి పోటీ ఇచ్చాడు. కాబట్టి అతడు టాప్ 2లో నిలిచే ఛాన్స్ కూడా ఉందని టాక్. చివరిగా ఐదో సీజన్లో విజేతగా వీజే సన్నీనే నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. హాట్స్టార్, మిస్డ్ కాల్స్ లో సన్నీకి భారీగానే ఓట్లు పోలయ్యాయట. దీంతో ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో అతడినే విన్నర్గా ప్రకటిస్తారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.