YS Jaganmohan Reddy: అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చంద్రబాబుపై, టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టని, కట్టలేని రాజధాని కోసం అమరావతి రైతుల యాత్ర పేరిట బాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గురువారం వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ టెంపరరీ అని పేరు పెట్టి.. 58 నెలలు కూడా రాజధానిగా పరిపాలన సాగించని ప్రాంతం గురించి. బాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలు చేస్తున్నారు. అమరావతి గురించి రకరకాలుగా డ్రామాలు జరుగుతున్నాయి. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ గురించి.. 1000 రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమానికి, రియల్ ఎస్టేట్ ఉద్యమానికి తెర తీశారు.
ఇతర ప్రాంతాలను రెచ్చ గొడుతూ.. ఈ రోజు ఒక డ్రామాను నడుపుతున్నారు. దశాబ్ధాలుగా నిర్మించుకున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంటే కూడా.. కట్టని, కట్టలేని ఈ అమరావతి వీరి దృష్టిలో చాలా గొప్పది. ఎవరి అభివృద్ధి కోసం వీరంతా ఉద్యమాలు చేస్తున్నారు?. ఎస్సీల కోసమా.. ఎస్టీల కోసమా.. బీసీల కోసమా.. లేక ఓసీల్లోని పేద ప్రజల కోసమా.. కాదే.. టీడీపీ కోసం ఉద్యమం చేస్తున్నారు. పెత్తందారుల సొంత అభివృద్ధి కోసమే ఉద్యమం చేస్తున్నారు. చంద్రబాబు హాయాంలో జగనన్న అమ్మ ఒడి లాంటి పథకం ఎందుకు లేదు? వైఎస్సార్ ఆసరా లాంటి పథకం ఎందుకు లేదు? చేయూత, రైతు భరోసా లాంటి పథకాలు ఎందుకు లేవు. నవరత్నాల ద్వారా లక్షా 65 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమచేశాం.
కరోనా సమయంలో కూడా ఆపలేదు. టీడీపీ హయాంలో, ఇప్పుడు ఒకే బడ్జెట్. కానీ, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అప్పుడు ఎందుకు లేదు? డబ్బులు ఎవరి జేబిలోకి వెళ్లాయి?.. ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో పథకం ఉండింది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు.. దోచుకోవటం పంచుకోవటం జరిగింది. అన్ని వ్యవస్థలు కూడా నా మనుషుల చేతుల్లోనే ఉండాలనేది ఆ పెత్తందారుల మనస్తత్వం. ప్రతిపక్ష పార్టీలో కూడా నా మనుషులే ఉండాలనేది ఆ పెత్తందారుల మనస్తత్వం. నాకు అమరావతిపై ఎలాంటి కోపం లేదు. అయినా ఎందుకు కోపం ఉండాలి? ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలనేది నా ఆకాంక్ష’’ అని అన్నారు. మరి, సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షంపై మండిపడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : అశ్వనీదత్, రాఘవేంద్రరావుకు కోరుకున్న ప్రాంతంలో భూములు ఇచ్చారు: ఎమ్మెల్యే కొడాలి నాని