తనపై తప్పుడు కథనాలు రాసిన పత్రిక తనకు క్షమాపణలు చెప్పేదాకా వదిలే ప్రసక్తే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. తనపై తప్పుడు కథనాన్నిరాసిన ప్రముఖ దినపత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావాను గతంలోనే లోకేశ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా తానే హాజరు కావాలన్న ఉద్దేశ్యంతోనే గురువారం విశాఖ వచ్చానని చెప్పిన లోకేశ్.. కోర్టు విచారణ ముగిసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు.
2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని ఓ ప్రతికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని చూసి మరో పత్రిక, ఓ మేగజీన్ కూడా ఇదే తరహా కథనాలను రాశాయని ఆయన చెప్పారు. ఆ కథనాలపై తాను వివరణ పంపించడంతో పాటు వాస్తవాలను కూడా ఆయా పత్రికలకు తెలియజేశానని లోకేశ్ చెప్పుకొచ్చారు. తాను ఇచ్చిన వివరణను చూసిన ఒక మేగజీన్ తనకు క్షమాపణ చెప్పిందని.. కానీ ఒక పత్రిక మాత్రం ఇప్పటి వరకు కనీసం తన వివరణను కూడా ప్రచురించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: ఊరికి బస్సు తెచ్చిన సింగర్ పార్వతి.. దాని వెనక పెద్ద కథ!
ఈ కారణంగానే ఆ పత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణను మరింత కాలం పొడిగించేలా కుట్రలు జరుగుతున్నాయని, అయితే న్యాయమూర్తి మాత్రం ఈ కేసును ఈ నెల 28లోగానే ముగించే దిశగా ఉన్నారని ఆయన చెప్పారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.