Chintamaneni Prabhakar: టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని చంపటానికి షూటర్ను రంగంలోకి దించినట్లు సమాచారం. శనివారం ఓ అగంతకుడు చింతమనేనికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పారంట. ‘ మీ హత్యకు షూటర్లను నియమిస్తున్నారు’ అని చెప్పాడంట. ఈ ఫోన్ కాల్ నేపథ్యంలో చింతమనేని పోలీసులను ఆశ్రయించారంట. ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంట. అగంతకుడి ఫోన్ కాల్పై దర్యాప్తు చేసి, తన భద్రతకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారంట. గన్మెన్ల జీతానికి వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే స్థోమత తనకు లేదని.. పోలీసులే ఉచితంగా భద్రత కల్పించాలని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారంట. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
కాగా, చింతమనేని ప్రభాకర్ గతంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తనపై అక్రమ కేసులు బనాయించి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆయన వాపోయారు. ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, నలుగురు ఐపీఎస్ అధికారులు, నలుగురు ఎస్సైలపై ఏలూరు కోర్టులో ఆయన ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత సంవత్సరంలోని ఆగస్ట్ లో పోలీసులు నన్ను ఎన్ కౌంటర్ చేయాలని చూశారంటూ చింతమనేని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గత రెండేళ్ల కాలంలో నాపై 25 కేసులు నమోదు చేశారని వాపోయారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నందుకు నాపై అక్రమంగా కేసులు పెడుతున్నారని చింతమనేని ప్రభాకర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. మరి, చింతమనేని ప్రభాకర్ హత్యకు కుట్ర జరుగుతోందన్న దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Divya Pandey: సివిల్స్లో 323వ ర్యాంకు వచ్చిందని సంతోష పడింది.. అంతలోనే..