వైసీపీ నేత లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగు అకాడమీ నిధుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు రూ.70 కోట్లకు పైగా అవినీతి జరిగిన అధికారులు తేల్చారు. ఇక దీంట్లో భాగంగా రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. ఇక త్రిసభ్య కమిటీ విచారణలో ఏపీ మార్కెంటైల్ మ్యూచివల్లీ ఎయిడెడ్- కోఆపరేటివ్ ఉద్యోగులు మోహినుద్దీన్, పద్మావతి UBI బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక యూనియన్ బ్యాంక్ నుంచి విత్ డ్రా అయిన డబ్బులు వీరు ముగ్గురు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలొో భాగంగా గోల్ మాల్ లో వీరి ముగ్గురి పాత్ర ఉన్నట్లు అధికారులు తేట తెల్లం చేశారు. ఇక త్రిసభ్య కమిటీ విచారణలో భాగంగా రేపు ప్రభుత్వానికి అన్ని వివరాలను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని రోజుల్లో ఈ కేసులో మరింత మందిని అరెస్ట్ చేయనున్నామని అధికారులు తెలియజేశారు.