బంగాళఖాతంలో ఏర్పడిన అసని తుపాన్ ఏపీ తీర ప్రాంతాల్లో కల్లోలం సృష్టించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైనగాలు వీచాయి. భారీ వృక్షాలు నేలకూలగా.. వందలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలపై అసని తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. అసని తుపాను ప్రభావంతో రాయలసీమ జిల్లాలో మామిడి, అరటి, ఇతర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ ప్రభావంతో వీచిన బలమైన ఈదురులగాలుల ధాటికి వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలడంతో రైతుల ఆవేద చెందుతున్నారు. రాలిన కాయలను మార్కెట్లో అడిగే వారు లేక.. వాటిని కుప్పలు కుప్పలుగా రోడ్ల పక్కన పడేస్తున్నారు.
రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో తుపాన్ రైతులు కన్నీటిని మిగిల్చింది. అరటి, మామిడి రైతులు నిలువునా నష్టపోయారు. మామిడి చెట్లు విరిగిపోయి.. కాయలు రాలిపోయాయి. ఇలాంటి కాయలను సేకరించి మార్కెట్ కు తరలిస్తే కొనేవారు కరవయ్యారు. సాధారణ కాయాలు టన్ను ధర రూ.40-50 వేలు పలుకుతున్నాయి. ఏడాది పొడవులు కష్టపడి సాగు చేస్తే.. చివరికి కోత సమయానికి తుపాన్ వచ్చి తమ నోట్లో మట్టికొట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాలిన కాయలను అడిగిన వారే లేరు. ఒకవేళ ఒకరు ఇద్దరు అడిగినా.. మరిదారుణమైన ధరకు అడుగుతున్నారు. కనీసం పెట్టుబడిసైతం రావడంలేదు. దీంతో దిక్కుతోచని రైతులు కాయలను రోడ్ల పక్కన కాల్వల్లో పడేసి వెళ్లిపోతున్నారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల నుంచి ట్రాక్టర్లలో రాయచోటి మార్కెట్ కు తరలించిన కాయలు అమ్ముడు కాకపోడవంతో.. రైతులు మార్గం మధ్యలోనే గుంతల్లో కుప్పలు కుప్పలు గా పడేస్తున్నారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మరి.. ఈ ఘటనపై మీఅభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఆస్తి ముద్దు.. అమ్మనాన్నలు వద్దు! బయటకి గెంటేసిన కుమారులు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.