బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? అయితే అక్షయ తృతీయ రోజు నుంచి మీ పెట్టుబడులను ప్రారంభించండి. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకొని మీ పెట్టుబడులు ప్రారంభించండి.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీం 2023 ఒకటి. ఈ స్కీం ద్వారా డిస్కౌంట్ ధరకే బంగారం పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడితే వడ్డీ కూడా వస్తుంది. మార్చి 6 నుంచే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆఫర్ కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఈ గోల్డ్ బాండ్స్ ఎలా కొనాలి? కొంటే వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి?