సయీద్ అన్వర్.. 1997 వరకూ అతడో అనామక క్రికెటర్. అలాంటి వాడిని భారత జట్టే హీరోని చేసింది. చెన్నై వేదికగా జరిగిన ఇండియా - పాక్ వన్డే మ్యాచులో అన్వర్ 194 పరుగులు చేయడంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచానికి హీరో అయిపోయాడు. ఆనాటి నుంచి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ(200; 2010) చేసే వరకు వన్డేల్లో అదే అత్యుత్తమ స్కోర్. ఆ ఒక్కటి తప్ప అతని కెరీర్ లో అంత పెద్ద గొప్ప ఇన్నింగ్స్ లు ఏమీ లేవు. ఆ ఒక్క ఇన్నింగ్స్ ను చెప్పుకొని.. 2003 వరకు జట్టులో కొనసాగాడు. ఆపై ఫామ్ కోల్పోయి జట్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.