విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో వాటాలను దక్కించుకునేందుకు బిడ్డింగ్ వేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమపై కేసీఆర్ కు కీలక నివేదిక అందింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయటాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిడ్డింగ్లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
మంగళవారం వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ తోపులాటలో ఆమె కిందపడింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆయన సతీమణికి అస్వస్థతకు గురయ్యారని వార్తలు రాగా, ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించి, పరీక్షలు చేపట్టారు.
దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం హోలీ వేడుకలు విషాదాలను మిగిల్చాయి. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మెడికో ప్రీతి ఆత్మహత్య కేసు సంచలనం మారింది. ఆమెది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికి హత్యే అని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ప్రీతి మరణించి వారం అవుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని ప్రీతి మరణంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని అంటూ సామాన్య జనం నుంచి రాజకీయ నాయకులు, సినీ సెలెబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ముందుగా తెలంగాణా చుట్టు ఉన్న రాష్ట్రలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఈక్రమంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేఫథ్యంలోనే త్వరలో ఏపీలో బీఆర్ఎస్ న్యూస్ పేపర్ రానుంది.
టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లనున్నాయని అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిస్తే.. అధికారం ఖాయం అన్న చర్చ రాజకీయవర్గాల్లో గట్టిగా నడుస్తోంది. అయితే, ఈ పొత్తులను అడ్డుకోవటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంట. ఇందుకోసం బలంగా పావులు కదుపుతున్నారంట.
టీమిండియా వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం వెనకున్న నిజం ఎంత? అసలు ఈ ప్రచారం జరగడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..