ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ నడుస్తోంది. క్రికెట్ ప్రియులందరూ మ్యాచ్ ను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరొకవైపు బెట్టింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి వారిపై నిఘా పెట్టిన పోలీసులు తరచూ అరెస్ట్ లు చేస్తుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మద్య కాలంలో కొందరు యువత ఈజీ మనీ కోసం దేనికైనా సిద్ధ పడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్, ఇతర బెట్టింగ్స్ పెడుతున్నారు. ఇక బెట్టింగ్ లకి బానిసలుగా మారి.. ఏకంగా అప్పుల పాలవుతున్నారు. అంతేకాక చివరకు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అలానే తాజాగా ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా నిండు జీవితాన్ని కోల్పోయాడు.
ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు ఎంత సంబురమో.. పోలీసులకు అంతకుమించిన పని. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉంటారు. ఇప్పుడు అదే సాగుతోంది. నగర శివారులో బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడిచేయగా.. ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
పోలీసులు కళ్లు గప్పి క్రికెట్ బెట్టింగ్ కాస్తున్నారా..? అయితే జాగ్రత్త. అలాంటి వారిని పోలీసులను తమదైన టెక్నాలజీ సాయంతో పట్టేసుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని విచారిస్తే వంద కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు బయటపడింది.