ఐపీఎల్ 2022 సీజన్ లో ఇప్పటికే సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ఇంకా సగం మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేదాకా సాయంత్రం అయ్యిందంటే అందరూ టీవీలు, మొబైల్స్ కు అతుక్కుపోతారు. ఈ నెల రోజులు బస్, ట్రైన్, మెట్రో ఇలా ఎక్కడ చూసినా ఫోన్లు పట్టుకుని ఐపీఎల్ లైవ్ చూస్తుంటారు. కానీ, అది ఫ్రీగా రాదుగా హాట్ స్టార్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఐపీఎల్ లైవ్ చూసే అవకాశం ఉంటుంది. అంతటి క్రేజ్ ఐపీఎల్ సొంతం అని అందరికీ తెలుసు. హాట్ స్టార్ కు డబ్బు ఎందుకు కట్టాలి అనుకున్నాడో ఏమో ఐపీఎల్ ఫ్రీగా చూసేందుకు హాట్ స్టార్ యాప్ నే హ్యాక్ చేశాడు.
ఇదీ చదవండి: చివరి ఓవర్లో దుమ్ములేపిన ధోని! మరోసారి తనేంటో చూపించాడు
తమిళనాడు రాష్ట్రం శివగంగకు చెందిన రామ్మూర్తి అనే యువకుడు నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ ఆదాయానికే గండి కొట్టేశాడు. ఐపీఎల్ లైవ్ ఫ్రీగా చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ నే హ్యాక్ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్ లైవ్ లింక్ సంపాదించాడు. ఇంకేముంది సొంతంగా ఓ యాప్ తయారు చేసి అందులే ఐపీఎల్ ఫ్రీగా స్ట్రీమ్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆఖరికి ఆ విషయం హాట్ స్టార్ సిబ్బంది దృష్టికి వెళ్లింది. వెంటనే యాజమాన్యం అతనిపై ఫిర్యాదు చేయగా.. తమిళనాడు పోలీసులు రామ్మూర్తిని అరెస్ట్ చేశారు. అంతా బానే ఉందిగానీ హాట్ స్టార్ యాజమాన్యం తీరును మాత్రం నెటిజన్స్ తప్పుబడుతున్నారు.అదేంటి తప్పు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడం తప్పెలా అవుతుంది అంటారా? అవునండి రామ్మూర్తి చేసింది తప్పే కావచ్చు. కానీ.. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలే వారి సాఫ్ట్ వేర్ లో బగ్ కొనుగొంటే ఎదురు లక్షల లక్షల డబ్బు ముట్టచెబుతుంది. అలాంటిది అంత పెద్ద నెట్వర్క్ ను హ్యాక్ చేసి ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ చేశాడంటే గొప్ప విషయమే కదా. వారి సిస్టమ్ లో అంత పెద్ద లూప్ హోల్ ను కనుగొన్న రామ్మూర్తిని పిలిచి సత్కరించాల్సింది పోయి ఇలా ఫిర్యాదు ఎలా చేస్తారంటూ నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. రామ్మూర్తి చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.