ఐపీఎల్ 2022 సీజన్ మొత్తం ఫుల్ ఆఫ్ సర్ ప్రైజెస్ అనే చెప్పాలి. 200 పైచిలుకు స్కోర్ చేయడం ఒకెత్తైతే.. వాటిని ఛేదించి ప్లేయర్లు ఔరా అనిపిస్తున్నారు. కొత్త జట్లు లక్నో, గుజరాత్ కూడా సీజన్ లో బోణీ కొట్టారు. అయితే ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో విజయం నమోదు కాలేదు. మొదటి మ్యాచ్ ఘోరంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ అడ్మిన్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రీల్స్ ఏనా ఆడిది ఏమైనా ఉంటుందా అంటూ చురకలు అంటిస్తున్నారు.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ, క్రిస్ గేల్ను వెనక్కు నెట్టి అరుదైన ఘనత సాధించిన ఉమేష్ యాదవ్
విషయం ఏంటంటే.. ఏప్రిల్ 2వ తారీఖు ఉగాది కాబట్టి తెలుగు ప్రేక్షకుల కోసం ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ మార్కరమ్ తో పంచ కట్టించారు. దానికి అట్లుంటది మనతోని- ఉగాది స్వాగ్ అంటూ రీల్ పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో వీడియో పడిందో లేదో.. హైదరాబాద్ టీమ్ అభిమానులు అడ్మిన్ పై విరుచుకుపడ్డారు. ఇలా రీల్స్ చేసుకోవడమేనా- మ్యాచ్ గెలిచేది ఏమైనా ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి ఆ వైరల్ రీల్ మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Atluntadi manathoni! Ugadi swag, mowas. 🔥😎@AidzMarkram#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/OoYAP2BLgQ
— SunRisers Hyderabad (@SunRisers) April 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.