ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత ఫామ్లో ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. అలాగే సూపర్ ఫీల్డింగ్తో కూడా రన్స్ సేవ్ చేస్తున్నాడు జట్టు కోసం. గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో నీషమ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ రెండో బంతిని హార్థిక్ పాండ్యా డీప్ మిడ్ వికెట్ వైపు షాట్ ఆడాడు. బౌండరీ వైపు దూసుకెళ్తున్న బంతిని అంతే వేగంతో వచ్చిన బట్లర్ డ్రైవ్ కొట్టి బాల్ను ఆపి కీపర్కు విసురుతాడు. ఈ క్రమంలో డ్రైవ్ చేసి లేచే టైమ్లో అతని కాలు బౌండరీ లైన్కు తగులుతుంది. బట్లర్ బంతి కరెక్ట్గానే ఆపాడు అని అంతా అనుకుంటున్నా.. బట్లర్ మాత్రం అతి బౌండరీ అన్న విషయాన్ని స్వయంగా ఒప్పుకుంటాడు.
ఇలా నిజాయితీని చాటి క్రీడా స్ఫూర్తిని పెంచుతాడు బట్లర్. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ స్పందిస్తూ.. క్రికెట్లో బట్లర్ జెంటిల్మెన్ అని, నిజానికి అతన్ని చూసి మిగతా ఆటగాళ్లు నేర్చుకోవాలని, ముఖ్యంగా అతని టీమ్మెట్స్ నేర్చుకోవాలని అన్నాడు. కాగా ఈ వ్యాఖ్యలు రాజస్థాన్ టీమ్లో ఉన్న టీమిండియా స్టార్ బౌలర్ రవీచంద్రన్ అశ్విన్ను టార్గెట్ చేస్తూ చెప్పినట్లు ఉన్నాయని కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో యువీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.గతంలో యువీ, అశ్విన్ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక టెస్టు మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య ట్వీట్ వార్ కూడా జరిగింది. అదే విధంగా ఐపీఎల్లో అశ్విన్ పంజాబ్ కింగ్స్కు ఆడుతున్న సమయంలో బట్లర్ను మన్కండింగ్ ద్వారా అవుట్ చేశాడు. అప్పట్లో ఈ అశ్విన్ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా అశ్విన్ బట్లర్ను అవుట్ చేశాడని మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. అవేవి పట్టించుకోని అశ్విన్.. తన చేసిన పనిని సమర్థించుకున్నారు. ఇప్పుడు తాజాగా బట్లర్ విషయంలో జెంటిల్మెన్ అంటూ పేర్కొని..ఇన్డైరెక్ట్గా అశ్విన్ను యువీ టార్గెట్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: హార్థిక్ పాండ్యా దెబ్బకు వికెట్లు మార్పించిన అంపైర్లు!
We still have gentleman in the game of cricket !!! @josbuttler 👏🏽 other players should learn from him specially team mates !!! #IPL2022 #RRvGT
— Yuvraj Singh (@YUVSTRONG12) April 14, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.