ఐపీఎల్ 2022లో కోల్కత్తా నైట్ రైడర్స్ పేసర్ ఉమేష్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టాడు. తాజాగా శుక్రవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మాయంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ లాంటి కీలక వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గానూ అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఈ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్తో ఉమేష్ ఒక అరుదైన ఘనత సాధించాడు. ఒకే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్లో అత్యధికసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
రోహిత్ శర్మ, క్రిస్గేల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లను సైతం వెనక్కినెట్టాడు. ఉమేశ్ యాదవ్కు పంజాబ్పై ఏకంగా ఆరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతకుముందు యూసఫ్ పఠాన్ దక్కన్ చార్జర్స్పై 5 సార్లు, రోహిత్ శర్మ కేకేఆర్పై 5 సార్లు, క్రిస్గేల్ కేకేఆర్పై 5 సార్లు ఈ ఘనత సాధించారు. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝘼𝙖𝙜 𝙡𝙖𝙜𝙖 𝙙𝙞 𝙝𝙖𝙞 𝙐𝙢𝙚𝙨𝙝 𝙗𝙝𝙖𝙞 𝙖𝙖𝙥𝙣𝙚! 🔥@y_umesh #KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/tHbiOjrLld
— KolkataKnightRiders (@KKRiders) April 1, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.