ఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ను మాటల్లో చెప్పలేం. మన దేశంలో అదో మతంలా మారిపోయిందనే భావన ఉంది. అలాంటి ఆటను నేర్చుకుని.. రాణించి.. జాతీయ జట్టుకు ఆడాలనే కల, కోరిక చాలా మంది యువకుల్లో ఉంటుంది. దాని కోసం చాలామంది కష్టపడతారు. మన దేశంలో క్రికెట్లో జాతీయ స్థాయికి వెళ్లడం అంత తేలికైన విషయం కాదు. బీభత్సమైన పోటీ ఉంటుంది. ఇలాంటి పోటీలో నెగ్గిరావాలంటే.. నైపుణ్యంతో పాటు అందుకు అవసరమైన శిక్షణ ఉండాలి. ఆ శిక్షణ పొందడం ఖర్చుతో కూడుకున్న విషయం.
సాధారణ, మధ్యతరగతి వారికి అది అందని దాక్షే. కానీ.. శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు ఒక పేదింటి కుర్రాడు. తండ్రి నడిపేది కిరాణా కొట్టు.. ప్రస్తుతం ఆ తండ్రి కొడుకు ఎంపికైంది.. టీమిండియా అండర్ 19 వరల్డ్ కప్ జట్టుకు. వచ్చే ఏడాది నుంచి వెస్టిండీస్ వేదికగా అండర్19 వరల్డ్ కప్ జరగనుంది. కేవలం కిరాణా కొట్టు నేపథ్యం ఉన్న ఒక సాధారణ యువకుడు.. అసాధారణమైన ఆటతో అండర్ 19 ప్రపంచ కప్ జట్టులో స్థానం సాధించడం వెనుక ఎంతటి కృషి, పట్టుదల ఉన్నాయో తెలుసుకుంటే.. అది ఎందరో యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది.
ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్లోని కోట్గావ్కు చెందిన సిద్దార్థ్ యాదవ్.. కిరాణా కొట్టు యజమాని శ్రవణ్ యాదవ్ కుమారుడు. ఆర్థికంగా బలమైన కుటుంబ నేపథ్యం లేకున్నా.. తండ్రి ఆశయాన్ని తన ఆశయంగా మార్చుకుని ముందుకు సాగుతున్నాడు. లక్ష్యసాధనలో ఒక మైలురాయిగా అండర్19 ప్రపంచకప్ జట్టులో చోటు సాధించాడు. శ్రవణ్ యాదవ్ తన కిరాణా కొట్టును మధ్యాహ్నం 2 గంటలకు మూసేసి.. సమీప మైదానంలో 6 గంటల వరకు త్రోడౌన్స్ వేస్తూ సిద్దార్థ్కు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. ఆ తర్వాత వచ్చి మళ్లీ షాప్ చూసుకునేవాడు. ‘8 ఏళ్ల వయసులో సిద్దార్థ్ తొలి బ్యాట్ పట్టుకున్నాడు. లెఫ్టాండర్గా నిలబడ్డాడు.
సిద్దార్థ్ కెరీర్ పురోగతిలో ఇద్దరూ అజయ్లు కీలక పాత్ర పోషించారు. మరో అండర్-19 క్రికెటర్ ఆరాధ్య యాదవ్ తండ్రి అజయ్ యాదవ్, భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ ఇద్దరూ సిద్దార్థ్కు అండగా నిలిచారు. అండర్-16 ట్రయల్స్ సమయంలో సిద్దార్థ్ తండ్రి ఓ మంచి కోచ్ను సూచించాలని అజయ్ యాదవ్ కోరాడట. ఆయన అజయ్ శర్మకు రిఫెర్ చేయగా.. సిద్దార్థ్ యాదవ్ అక్కడే కోచింగ్ తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అండర్-16 జట్టుకు సెలెక్ట్ అయిన సిద్దార్థ్.. ఆ సీజన్లో హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీతో పాటు ఐదు సెంచరీలున్నాయి. ఆ పెర్ఫామెన్స్తో అతను జోనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చోటు దక్కించుకున్నాడు.
కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ జరగకపోవడంతో.. ప్రపంచకప్ జట్టు కోసం బీసీసీఐ అండర్-19 చాలెంజర్స్ ట్రోఫీ నిర్వహించింది. ఈ టోర్నీలో సిద్దార్థ్ సెకండ్ హయ్యెస్ట్ రన్నర్గా నిలిచాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్తో జరిగిన ట్రై సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన సిద్దార్థ్.. ఓ మ్యాచ్లో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడే తన కెరీర్ను మొదలుపెట్టిన సిద్దార్థ్ చాలా సాధారణంగా వ్యక్తి. ఇతర క్రికెటర్లలా అతనికి కనీసం మొబైల్ ఫోన్, ఇతర గాడ్జెట్స్ కూడా లేవు. మరి కిరాణా కొట్టు ఓనర్ కొడుకు స్థాయి నుంచి టీమిండియా అండర్19 టీమ్ మెంబర్గా ఎదిగిన సిద్ధార్థ్ అసాధారణ ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు..
Here’s India’s squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue
Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr
— BCCI (@BCCI) December 19, 2021