ఐపీఎల్ 2022 సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమయ్యాయి. ఇటివల బెంగుళూరు వేదికగా జరిగిన మెగా వేలంలో అన్ని జట్లు తమకు కావాల్సి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. కాగా ఐపీఎల్ మెగా వేలంలో టీమిండియా యువ ఆల్రౌండర్ దీపక్ చాహర్ భారీ ధర పలికాడు. ఏకంగా రూ.14 కోట్లు పెట్టి ధోని కెప్టెన్గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. మరికొంత మంది ఆటగాళ్లు కూడా మంచి ధరకు అమ్ముడుపోయారు. దీపక్ చాహర్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. వాస్తవానికి అతను ఎక్కువగా బౌలింగ్తోనే జట్టుకు ఎక్కువగా ఉపయోగపడుతుంటాడు.
బ్యాటింగ్ సంగతి పక్కన పెట్టి బౌలింగ్ గురించి విశ్లేషించుకుంటే.. దీపక్ ఐపీఎల్లో ఒక్క ఓవర్ బౌలింగ్ చేసేందుకు ఏకంగా రూ.20.5 లక్షలు తీసుకుంటున్నాడు. అతనికి దక్కిన ధర ప్రకారం చూస్తూ ఈ లెక్క నిజంగా నిజం. 2022 సీజన్లో ప్రతి జట్టు 14 లీగ్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. దాంతో పాటు ప్లేఆఫ్స్, ఫైనల్ కలిపి మరో మూడు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ లెక్కన దీపక్ చాహర్ గరిష్టంగా 68 ఓవర్ల బౌలింగ్ చేయనున్నాడు. అంటే ఒక్క ఓవర్కు రూ.20.5 లక్షల పైచిలుకు పొందనున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
లేటెస్ట్ అప్డేట్స్ కి SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.