క్రికెట్ అభిమానులకు కావాల్సినంత వినోదం పంచుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తోంది. ఈ లీగ్తో బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తుంది. ఈ ఏడాది రెండు కొత్త జట్ల రాకతో కూడా బీసీసీఐకి ఏకంగా 8వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఐపీఎల్ కంటే ముందే ప్రపంచ క్రికెట్లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ.. ఐపీఎల్తో మరింత రిచ్గా మారిపోయింది. దీంతో ప్రపంచ క్రికెట్పై పట్టు సాధించింది. దీంతో బంగారుబాతుగా ఉన్న ఐపీఎల్ను మరింత విస్తరించేందుకు బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది రెండు కొత్త జట్లు రావడంతో మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 74కు పెరిగింది. మ్యాచ్ల సంఖ్య పెరుగుదలతో కూడా బీసీసీఐకి లాభమే. దీంతో వచ్చే ఏడాది మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచాలని కూడా బీసీసీఐ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదే జరిగితే క్రికెట్ అభిమానులకు పండుగే. మరిన్ని రోజులు ఐపీఎల్ మాజాను పొందవచ్చు. కానీ.. దీని కోసం ఐసీసీ నుంచి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం బీసీసీఐకి ఉన్న పలుకుబడికి అది పెద్ద విషయం కాదు. ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకే బీసీసీఐ మ్యాచ్ల సంఖ్య పెంచాలని చూస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా.. ఈ ఏడాది 10 జట్లను రెండు గ్రూపులుగా చేసి.. ఒక గ్రూప్లోని జట్టు మిగితా జట్లతో రెండు మ్యాచ్లు.. వేరే గ్రూప్లోని ఒక జట్టుతో రెండు, మిగిలిన నాలుగు జట్లతో ఒక మ్యాచ్లు ఆడేలా షెడ్యూల్ రూపొందించారు. మరి వచ్చే ఏడాది మ్యాచ్ల సంఖ్య పెరిగితే షెడ్యూల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. మొత్తానికి వచ్చే ఏడాది ఐపీఎల్ సరికొత్త రూపు సంతరించుకోనుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ishan Kishan: వీడియో: వెంకటేశ్ అయ్యర్ను అవుట్ చేయలేక ఇషాన్ కిషన్ స్లెడ్జింగ్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.